బ్యాడ్మింటన్ ఆటలో పలు మెడల్స్ గెలుచుకొని క్రీడా అభిమానులను ఎంతగానో అలరించిన ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల గురించి తెలియజేయాల్సిన అవసరం లేదు.కాగా గుత్తా జ్వాల 2005వ సంవత్సరంలో జూలై 17వ తారీఖున చేతన్ ఆనంద్ అనే మరో బ్యాడ్మింటన్ ప్లేయర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
అయితే కానీ ఏమైందో ఏమో గాని అనుకోకుండా వీరిద్దరి మధ్య కొంతకాలానికి మనస్పర్థలు రావడంతో గుత్తా జ్వాల తన భర్త చేతన్ ఆనంద్ కి 2011 వ సంవత్సరంలో విడాకులు ఇచ్చింది.దీంతో అప్పటి నుంచి గుత్తా జ్వాలతన ఆట కి దూరంగా ఉంటోంది.
ఇటీవలే జ్వాలా గుత్తా తమిళ సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖ హీరో విష్ణు విశాల్ తో ప్రేమలో పడింది.దీంతో ఇరువురి కుటుంభ సభ్యుల అంగీకారంతో వీరిద్దరూ తొందర్లోనే పెళ్ళి కూడా చేసుకోబోతున్నట్లు ఇటీవలే విష్ణు విశాల్ అధికారికంగా ప్రకటించాడు.
కాగా తాజాగా విష్ణు విశాల్ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా చిట్ చాట్ కార్యక్రమం నిర్వహించి తనకి కాబోయే భార్య గుత్తా జ్వాల గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.
ఇందులో భాగంగా తామిద్దరూ మొదటగా ఒకరినొకరు క్షుణ్ణంగా అర్థం చేసుకున్న తర్వాతనే పెళ్లి చేసుకోబోతున్నట్లు స్పష్టం చేశాడు.
అంతేకాకుండా గుత్తా జ్వాల అంటే తనకు ఎంతో అభిమానమని అన్నీ కుదిరితే ఆమె జీవిత గాథ ఆధారంగా బయోపిక్ ని కూడా తీస్తానని విష్ణు విశాల్ చెప్పుకొచ్చాడు.అయితే తన భార్యతో విడాకులు తీసుకున్న విషయంపై స్పందిస్తూ ఇద్దరి మధ్య మనస్పర్ధలు భేదాభిప్రాయాలు వచ్చాయని అందువల్లనే తామిద్దరూ ఇరువురి అంగీకారంతోనే విడాకులు తీసుకున్నామని అంతేతప్ప వేరే ఇతర కారణాలేమీ లేవని తెలిపాడు.
ఈ విషయం ఇలా ఉండగా ఇటీవల విష్ణు విశాల్ “అరణ్య” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించాడు.ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, తదితర భాషలలో విడుదల కాగా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం నమోదు చేసింది.
కాగా ప్రస్తుతం విష్ణు విశాల్ తమిళంలో ప్రముఖ దర్శకుడు ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న “ఎఫ్ఐఆర్” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.అలాగే ఈ చిత్రానికి విష్ణు విశాల్ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు.
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు చెన్నై పరిసర ప్రాంతంలో జరుగుతున్నట్లు సమాచారం.