తెలుగు సినిమా రంగంలో పనిచేసే వర్కర్లకు మరియు ఎంప్లాయిస్ కి ఫ్రీగా వ్యాక్సిన్ అందించబోతున్నాట్లు మెగాస్టార్ చిరంజీవి ప్రకటన చేశారు.దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం శరవేగం చేసిన సంగతి తెలిసిందే.
దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ పంపిణీ కేంద్రాలు భారీ ఎత్తున ఏర్పాటు చేస్తూ ఉన్నాయి.దేశంలో చాలా ప్రముఖ కంపెనీల యాజమాన్యాలు తమ అధీనంలో పనిచేసే వర్కర్లకు.
ఫ్రీగా వ్యాక్సిన్ వేస్తూ ఉన్నాయి.
ఇలాంటి తరుణంలో ఇండస్ట్రీకి పెద్దగా వ్యవహరిస్తూ ఉన్న చిరంజీవి .టాలీవుడ్ ఇండస్ట్రీ లో పని చేసే సినీ కార్మికులకు వ్యాక్సిన్ అందించడానికి ముందుకు రావటం పట్ల ఇండస్ట్రీ పరిధిలో పనిచేసే వర్కర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.లాక్ డౌన్ సమయం లో “కరోనా క్రైసిస్ చారిటీ” సీసీసీ అనే చారిటబుల్ ట్రస్ట్ ద్వారా .పనులు లేక షూటింగులకు వెళ్ళలేక ఇంటి దగ్గరే అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నా సినీ కార్మికులకు నిత్యావసర వస్తువులు అందించి ఆదుకోవడం జరిగింది.ఇప్పుడు ఇదే ట్రస్టు ద్వారా ఫ్రీగా సినీ కార్మికులకు వ్యాక్సిన్ వేయబోతున్నట్లు చిరంజీవి స్పష్టం చేశారు.
.