తిరుపతి ఉప ఎన్నికలలో బిజెపి జనసేన కూటమి విజయం సాధించడం కోసం అనేక వ్యూహాలు వేస్తున్న సంగతి తెలిసిందే.మాజీ ఐఏఎస్ రత్నప్రభ బిజెపి పార్టీ నుండి పోటీ చేస్తూ ఉండగా ఇప్పటికే ఆమె కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాదయాత్ర చేసి రెండు పార్టీల క్యాడర్లో జోష్ నింపారు.
ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం బిజెపి జనసేన కూటమి కి ఊహించని షాక్ ఇచ్చినట్లయింది.మేటర్ లోకి వెళ్తే జనసేన పార్టీ ఎన్నికల గుర్తు హాట్ టాపిక్ అయింది.
గాజు గ్లాస్ గుర్తు ను గోదా రమేష్ పోటీ చేస్తున్న నవతరం పార్టీకి ఎన్నికల కమిషన్ కేటాయించడంతో బిజెపి జనసేన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.ఎన్నికల కమిషన్ తీసుకున్న ఈ నిర్ణయంతో జనసేన ఓట్లు క్రాస్ అవుతాయని బీజేపీ ఆందోళన చెందుతూ ఉంది.
ఇదిలా ఉంటే జనసేన పార్టీకి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా హోదా రాలేదు.ఈ తరుణం లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెట్టిన సభకి ఊపు వచ్చింది అనుకున్న టయానికి ఎన్నికల కమిషన్ గాజు గ్లాస్ గుర్తు నవతరం పార్టీకి కేటాయించడం బీజేపీకి పెద్ద తలనొప్పిగా మారింది.
ఈ విషయంలో ఇరు పార్టీల శ్రేణులు ఎన్నికల కమిషన్ ని కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
.