యాక్షన్ హీరోగా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు గోపీచంద్.ప్రస్తుతం గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో సిటీమార్ సినిమా తెరకెక్కింది.
ఈ సినిమాలో తమన్నా గోపీచంద్ కి జోడీగా నటించింది.అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసి మళ్ళీ వాయిదా వేసేశారు.
ప్రస్తుతం సినిమాకి సంబందించిన ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని తెలుస్తుంది.ఇదిలా ఉంటే ఇప్పుడు గోపీచంద్ తేజ దర్శకత్వంలో అలివేలు వెంకటరమణ అనే సినిమా చేయడానికి ఒకే చెప్పాడు.
ఫ్యామిలీ డ్రామాగా, భార్యాభర్తల కథాంశంతో ఈ సినిమాని తేజ తెరకెక్కిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ కూడా ఫైనల్ అయిపొయింది.
అయితే సిటీమార్ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత అలివేలు వెంకటరమణ స్టార్ట్ చేద్దామని గోపీచంద్ భావించి ఇన్ని రోజులు ఆపుకుంటూ వచ్చారు.ఇక సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం చాలా మంది పేర్లు వినిపించాయి.
అనుష్క, సాయి పల్లవి పేర్లు ప్రముఖంగా తెరపైకి వచ్చాయి.
అయితే ఫైనల్ గా కీర్తి సురేష్ పేరు వచ్చింది.
ఆ మధ్య కీర్తి సురేష్ కి తేజ స్టొరీ నేరేట్ చేయడం జరిగిందని, ఆమె కూడా ఒకే చెప్పడం జరిగిందని టాక్ వినిపించింది.అయితే హీరోయిన్ కీర్తి సురేష్ అనే విషయాన్ని తేజ టీం అఫీషియల్ గా ఎనౌన్స్ చేయలేదు.
మహానటి తర్వాత కీర్తి సురేష్ తెలుగులో నటించిన రెండు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి.ఈ నేపధ్యంలో పాత్రల విషయంలో మరింత ఆచితూచి ముందుకి వెళ్తున్న ఈ భామ అలివేలువెంకటరమణకి ఒకే చెప్పింది.
వచ్చే నెల నుంచి ఈ చిత్రం షూటింగ్ హైదరాబాదులో జరుగుతుందని తెలుస్తుంది.ఇదిలా ఉంటే కీర్తి సురేష్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుకి జోడీగా సర్కారు వారి పాట సినిమాలో నటిస్తుంది.
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది.