పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెరపై కనిపిస్తేనే ఫ్యాన్స్ సందడి ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈలలు, కేకలు, కేరింతలతో మొత్తం సందడి చేస్తారు.
పవర్ స్టార్ ని తెరపై కనిపించినంత సమయంలో ప్రేక్షకులు అతని యాక్టింగ్ ని ఆశ్వాదిస్తూనే ఉంటారు.అలా అని గొప్ప యాక్టర్ కాదు.
కాని అతనికున్న చరిష్మా ప్రేక్షకులని అలా కట్టిపడేస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.ఇక పవన్ కళ్యాణ్ గొంతు సరిచేసుకొని పాట పాడితే ఇక ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చేస్తాయి.
గతంలో చాలా సినిమాలలో పవన్ పాట పాడి ఫ్యాన్స్ ని అలరించాడు.పవన్ కళ్యాణ్ పాడిన పాటలు చాలా వరకు సూపర్ హిట్ అయినవే.
ఇప్పటి వరకు ఆయన కెరియర్ లో తమ్ముడు నుంచి మొదలుపెడితే అజ్నాతవాసి వరకు ఎనిమిది పాటలు పాడారు.వాటిలో చాలా వరకు ఫన్ గా వచ్చే బిట్ సాంగ్స్ కావడం విశేషం.
ఈ సారి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా పవన్ కళ్యాణ్ పాట పాడించడానికి రెడీ అయ్యాడు.ఈ విషయాన్ని తాజాగా వకీల్ సాబ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో అఫీషియల్ గా తమన్ క్లారిటీ ఇచ్చాడు.
వకీల్ సాబ్ సినిమాకి తమన్ మ్యూజిక్ అందించారు.ఇప్పుడు అయ్యప్పన్ కోశియమ్ రీమేక్ కోసం కోసం కూడా పవన్ కళ్యాణ్ కోసం తమన్ మ్యూజిక్ అందించబోతున్నాడు.
బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు పవన్ కళ్యాణ్ తో చేసే అవకాశం రావడంతో తమన్ చాలా ఉద్వేగంతో ఉన్నాడు.తనకు త్రివిక్రమ్ వల్లే పవన్ కళ్యాణ్ తో పనిచేసే అవకాశం వచ్చిందని తమన్ చెప్పుకొచ్చాడు.
అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్లో పవన్ కళ్యాణ్ పాడబోయే పాట అదిరిపోతుంది అని, ఫ్యాన్స్ కోరుకునే రేంజ్ లోనే ఈ పాట ఉండబోతుందని క్లారిటీ ఇచ్చాడు.