పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మొదలయినప్పటి నుండి కూడా కరోనా వెంటాడుతూనే ఉంది.కొన్ని రోజులు షూటింగ్ పూర్తి అయిన వెంటనే కరోనా కారణంగా షూటింగ్ నిలిచి పోయిన విషయం తెల్సిందే.
ఆ తర్వాత కరోనా లాక్ డౌన్ ఎత్తి వేయడంతో మళ్లీ షూటింగ్ మొదలు పెట్టారు.కరోనా జాగ్రత్తలు తీసుకుంటు సినిమా ను పూర్తి చేశారు.
సినిమా షూటింగ్ ఏదోలా పూర్తి చేసిన మేకర్స్ సినిమాను మళ్లీ థియేటర్ లు ఓపెన్ అవ్వడంతో ఈ నెలలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశారు.తీరా సినిమా విడుదల సమయంలో కరోనా కేసులు విపరీతంగా పెరగడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది.
కరోనా కేసులు పెరిగిన కారణంగా థియేటర్లకు జనాలు వస్తారా రారా అనే ఆందోళన వ్యక్తం అవుతోంది.ఇక ఈ సినిమా కు సమస్య మీద సమస్య వెంటాడుతూనే ఉంది.
కరోనా కారణంగా వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ వేడుకను రద్దు చేశారు.యూసుఫ్ గూడ పోలీస్ స్టేడియంలో పెద్ద ఎత్తున జరగాల్సిన ఈవెంట్ ను కాస్త సింపుల్ గా జరిపేస్తున్నారు.
మరో వైపు ఈ సినిమా లో ఒక కీలక పాత్రలో నటించిన నివేదా థామస్ కు కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యింది.కరోనా నిర్థారణ అవ్వడం వల్ల ఆమెతో ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్న అంజలి, వేణు శ్రీరామ్ చిత్ర యూనిట్ సభ్యులు ఇతరులు కూడా ఇప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి.
నేడు శిల్ప కళా వేదికలో జరుగబోతున్న వేడుకలో వీరు హాజరు కాకపోవచ్చు అంటున్నారు.పవన్ కళ్యాణ్ ఇప్పటికే చిరంజీవి మరియు చరణ్ లను కరోనా కారణంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వద్దని చెప్పాడంటూ వార్తలు వస్తున్నాయి.
ఇక ఈవెంట్ ను అతి తక్కువ మంది ప్రేక్షకులతో నిర్వహించబోతున్నారు.దాంతో ఈ వెంట్ కళ తప్పినట్లుగా ఉంటుందని అంటున్నారు.