అసెంబ్లీలో రచ్చ రచ్చ.. స్పీకర్‌ పైకి చెప్పులు విసిరిన బీజేపీ నేతలు.. ?

సమాజానికి సమాధానంగా, ఆదర్శంగా ఉండవలసిన నేతలు అసహనానికి లోనై, క్షణికమైన ఆవేశంలో ప్రవర్తిస్తున్న తీరు ఎన్నో సందర్భాల్లో చర్చకు దారితీసింది.నేతల మధ్య మాటల యుద్దాలు మామూలే కానీ చేయి చేసుకోవడం, మరే ఇతర పరంగా దాడిచేయడం మాత్రం సహించని విషయం.

 Odisha Bjp Mlas Throw Slippers Earphones On Speaker , Bjp Mlas, Suspended Odish-TeluguStop.com

ఇక అసెంబ్లీ అంటే ఎన్నో సమస్యలకు పరిష్కారం కనుగునే వేదిక ఇలాంటి ప్రదేశంలో నేతలు ప్రవర్తిస్తున్న తీరు సంచలనంగా మారుతుంది.ఇకపోతే తాజాగా ఒడిశా అసెంబ్లీలో బీజేపీ నేతలు ఆగ్రహంతో స్పీకర్‌పైకి చెప్పులు విసరడం చర్చనీయాంశంగా మారింది.

లోకాయుక్త సవరణ బిల్లుల విషయంలో చర్చ జరపకుండా సభ ఆమోదించడం పై బీజేపీ సభ్యులు మండిపడుతూ, స్పీకర్‌ పాత్రోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పోడియం వైపు చెప్పులు, మైక్రోఫోన్‌లను విసిరారట.ఈ ఘటనతో స్పీకర్ సభను ‌వాయిదా వేస్తూ, ముగ్గురు బీజేపీ సభ్యులపై సస్పెన్షన్‌ వేటు వేశారు.

అసెంబ్లీ సమావేశాలు ముగిసేవరకు ఈ సస్పెన్షన్‌ అమల్లో ఉంటుందని, వెంటనే వారు సభలో నుండి వెళ్లిపోవాలని ఆదేశించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube