ఒక చిన్న పొరపాటు జేబుకు చిల్లుపడేలా చేసింది.కాగా ఈ మధ్య కాలంలో జీహెచ్ఎంసీ చలాన్ల మీద చలానాలు విధిస్తున్న విషయం తెలిసిందే.
వారి నిబంధనలకు విరుద్దంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడైనా జరుగుతున్నట్లు సమాచారం వచ్చింది మొదలు వేగంగా స్పందించి జరిమానాలను వేస్తున్నారు.ఇలాంటి ఘటనే తాజాగా నగరంలో జరిగింది.
నగరంలోని ఓ కరెంటు స్తంభానికి టూలెట్ పేపర్ అంటించి, ఎవరికైనా సింగిల్ బెడ్ రూమ్, డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు కావాలంటే, ఈ నంబర్ ను సంప్రదించాలంటూ పెట్టిన బోర్డును చూసిన జీహెచ్ఎంసీ విభాగమైన డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ ఫోర్స్ మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ (ఈవీడీఎం) వారికి రూ.2 వేల జరిమానా విధించింది.
కాగా ఓ సొసైటీకి చెందిన సభ్యులు ఇటువంటి పోస్టర్ల వల్ల స్తంభాలు, తమ గోడలు అంధ వికారంగా తయారు అవుతున్నాయని ఫిర్యాదు చేయడం వల్ల అధికారులు చర్యలకు దిగారట ఇకపోతే ఆ టూలెట్ పేపర్ కు సంబంధించిన నంబర్ గల వ్యక్తి చిరునామా నగరంలో లేదని, సిద్ధిపేట జిల్లా పాములపర్తి గ్రామానికి చెందిన వారిగా ఈవీడీఎం అధికారులు గుర్తించారు.
కాగా ఇదే పిల్లర్ పై యాక్ట్ ఫైబర్ నెట్ ప్రకటన కూడా ఉంది కానీ వారిపై ఏం చర్యలు తీసుకున్నారని అదే సొసైటీ ప్రశ్నించగా, అధికారుల నుంచి ఎలాంటి సమాధానం ఇంకా రాకపోవడం గమనార్హం.