ఆ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ఎంత భయంకరంగా ఉందంటే.. ?

దేశంలో కరోనా చేస్తున్న విధ్వంసం ఎంత భయంకరంగా ఉందో కొన్ని చోట్ల చోటు చేసుకుంటున్న ఘటనలు చూస్తే అర్ధం అవుతుంది.ఇంక ఎంతకాలం మనుషులను పీడిస్తుందో తెలియదు గానీ ఈ కరోనా వల్ల ప్రజలు దయనీయస్దితిని అనుభవిస్తున్నారు.

 Chhattisgarh Has Terrible Effect On Corona Second Wave ,chhattisgarh, Durg, Gove-TeluguStop.com

పేదల బ్రతుకులు అయితే మరీ అద్వానంగా మారుతున్నాయి.

ఇకపోతే ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌లో ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో కరోనా వల్ల మరణించిన వారి మృత దేహాలు కుప్పలుగా పేరుకుపోతున్నాయట.

ఈ రాష్ట్రంలో కరోనా మరోసారి విజృంభిస్తుండటంతో ఆ ఎఫెక్ట్ ఆసుపత్రులపై పడుతోంది.ఫలితంగా కేసులకు సరిపడా సిబ్బంది లేకపోవడంతో ఈ పరిస్థితి వచ్చినట్లు ఇక్కడి సిబ్బంది చెబుతున్నారట.

ఇక కరోనా వల్ల గత ఏడు రోజుల్లో 38 మంది ఈ ఆసుపత్రిలో మరణించగా, ఎనిమిది ఫ్రీజరర్లు మాత్రమే ఉండటంతో మిగతా మృతదేహాలను పక్కనే కుప్పలుగా వేసినట్లుగా తెలుస్తుంది.ఇక్కడి దృశ్యాల దయనీయ పరిస్థితికి హృదయం ద్రవించక మానదు.

ఇక కరోనా విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్న వారు ఇక్కడ సెకండ్ వేవ్ ఎంత భయంకరంగా ఉందో తెలుసుకుంటే చాలు కాస్త ఐన జాగ్రత్తగా ఉంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube