టీటీడీ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది.గతంలో వయోపరిమితి పేరుతో రిటైరైన అర్చకులను మరియు ప్రధాన అర్చకులను తిరిగి విధుల్లోకి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది.
వయోపరిమితి పేరుతో రిటైర్ అయిన అర్చకులు తిరిగి విధుల్లోకి రావాలని 38118/2018 హైకోర్టు తీర్పు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ స్పష్టం చేసింది.తిరుమల తిరుపతి దేవస్థానం తాజా ఆదేశాలతో మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు తిరిగి విధుల్లో చేరనున్నారు.
దీంతో ప్రస్తుత ఆలయ ప్రధాన అర్చకులుగా కొనసాగుతున్న వారి విషయంలో సందిగ్ధత నెలకొంది.వాళ్లు ప్రధాన అర్చకులుగా కొనసాగుతారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.శ్రీవారి ఆలయానికి సంబంధించి 2018 మే మాసంలో.అప్పటి పాలక మండలి ఆలయ అర్చకులకు రిటైర్మెంట్ నిబంధనలు అమల్లోకి తీసుకు రావడం జరిగింది.
దీంతో 65 సంవత్సరాలు పైబడిన అర్చకులు రిటైర్ అవ్వాల్సి ఉంటుంది అంటూ తెలపడంతో అప్పటి ప్రధాన అర్చకులుగా ఉన్న రమణదీక్షితులు మరియు కొంతమంది అర్చకులు రిటైర్ అయ్యారు.అయితే ఇప్పుడు టిటిడి తీసుకున్న తాజా నిర్ణయంతో వీళ్లంతా తిరిగి విధుల్లోకి వచ్చే అవకాశం ఉంది.