టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎన్నో ఘన విజయాలను సొంతం చేసుకున్న హీరోలలో చిరంజీవి ఒకరు.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే చిరంజీవి ట్విట్టర్ ఖాతాకు లక్షల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు.
అయితే చిరంజీవి మాత్రం తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఒకరిని మాత్రమే ఫాలో అవుతారు.ఆ ఒక్కరు ప్రముఖ లిరిసిస్ట్ రామజోగయ్యశాస్త్రి కావడం గమనార్హం.తెలుగులో రామజోగయ్యశాస్త్రి రాసిన ఎన్నో పాటలు బ్లాక్ బస్టర్ హిట్ అనే సంగతి తెలిసిందే.
2020 సంవత్సరంలో మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చారు.తక్కువ ట్వీట్లు చేసినా ప్రేక్షకులు మెచ్చే ట్వీట్లు చేస్తూ చిరంజీవి ట్విట్టర్ ఫాలోవర్లకు మరింత చేరువయ్యారు.ప్రొఫైల్ పిక్ లను తరచూ మారుస్తూ ఆ ప్రొఫైల్ పిక్స్ ద్వారా కూడా చిరంజీవి తన ట్విట్టర్ ఖాతాతో వార్తల్లో నిలిచారు.
మొదట రామ్ చరణ్ ను మాత్రమే ఫాలో అయిన చిరంజీవి రామ్ చరణ్ ను కూడా అన్ ఫాలో అయ్యి అభిమానులకు ఒకింత ఝలక్ ఇచ్చారు.
ప్రస్తుతం చిరంజీవి రామజోగయ్యను మాత్రమే ఫాలో అవుతుండగా ఈ విషయం రామజోగయ్య శాస్త్రికి తెలిసి ఆయన ఎమోషనల్ అయ్యారు.చిరంజీవి గారి ప్రేమకు తాను ఎంతో రుణపడి ఉంటానని.చిరంజీవి గారు తనను మాత్రమే ఫాలో అవుతున్నారని తెలిసి కొండంత సంతోషంతో ఉన్నానని రామజోగ్య్య శాస్త్రి వెల్లడించారు.
అయితే చిరు రామజోగయ్య శాస్త్రిని మాత్రమే ఫాలో కావడానికి గల కారణం తెలియాల్సి ఉంది.
చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తి కాగా ఈ సినిమా తరువాత చిరంజీవి లూసిఫర్, వేదాళం రీమేక్ లలో నటిస్తున్నారు.
యంగ్, మిడిల్ రేంజ్ హీరోలకు ఝలక్ ఇచ్చేలా చిరంజీవి కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.