అక్కినేని అఖిల్ ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాతో అయినా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు అఖిల్.
రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమా బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు.
అఖిల్ కు ఇప్పటి వరకు సరైన హిట్ ఒక్కటి కూడా పడలేదు.నటన, డాన్స్ లో అదరగొడుతున్న ఎందుకో అఖిల్ కు కలిసిరావడం లేదు.ఈయన ఎంచుకునే స్టోరీలు వల్లే సినిమాలు ప్లాప్ అవుతున్నాయి.అందుకే ఈ సినిమా అఖిల్ కెరీర్ కు చాలా అవసరం.
నాగార్జున కూడా అఖిల్ కు మంచి హిట్ రావాలని ఈ సినిమా మీద ప్రత్యేక ద్రుష్టి పెట్టినట్లు తెలుస్తుంది.
అయితే ఈ సినిమాలో అఖిల్ పూజ హెగ్డే కెమిస్ట్రీ స్క్రీన్ పై చాలా అందంగా ఉంటుందని తెలుస్తుంది.అన్ని సినిమాల్లాగానే ఈ సినిమా కూడా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.జూన్ 19 న ఈ సినిమా రిలీజ్ అవ్వనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు.
అయితే తాజాగా ఈ సినిమా నుండి మరొక పాట విడుదల అవ్వబోతున్నట్టు చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ను రిలీజ్ చేసారు.
ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందించారు.
ఇప్పటికే విడుదల అయిన రెండు పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.ఇప్పుడు ఈ సినిమా నుండి మూడవ పాటగా ‘ఏ జిందగీ’ అనే లిరికల్ పాటను ఏప్రిల్ 5 న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ఈ రోజు ప్రకటించారు.
ఇది ఇలా ఉండగా ఈ సినిమా తర్వాత అఖిల్ సురేందర్ రెడ్డితో మరొక సినిమా చేయబోతున్నాడు.