ఆ రాష్ట్రంలో కలకలం.. బీజేపీ నేత ఇంటిపై బాంబు దాడి.. ?

దేశంలో ఇన్నాళ్లుగా ఉగ్రవాద దాడులు లేవు.కానీ తాజాగా జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్ లో విరుచుకుపడిన ఊగ్రవాదుల దాడి కలకలాన్ని సృష్టిస్తుంది.

 Bomb Attack On Bjp Leader Hous  Terrorists, Attack, Bjp Leader, Anwar Khans, Res-TeluguStop.com

ఇక పూర్తి వివరాల్లోకి వెళ్లితే.

జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్ శివారు ప్రాంతమైన అరిభాగ్‌లో బీజేపీ నేత అన్వర్​ఖాన్ ఇంటిపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు.

దాడిలో అన్వర్ ఖాన్ సురక్షితంగా బయటపడగా, ఆయన ఇంటి వద్ద విధుల్లో ఉన్న ఒక కానిస్టేబుల్ మృతి చెందినట్టు పోలీసుల సమాచారం.

కాగా ఈ దాడి ఈరోజు ఉదయం సుమారు 11.30 గంటలకు జరిగినట్టు సమాచారం.ఇకపోతే ఈ కాల్పుల్లో మృతి చెందిన కానిస్టేబుల్‌ను రమ్జీత్ రాజా గా గుర్తించినట్టు ఉన్నతాధికారులు వెల్లడించారు.

ఇక దాడి జరిగిన ఈ ప్రాంతంలో పోలీసులు, భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయని పూర్తి వివరాలు త్వరగానే వెల్లడిస్తామని అధికారులు పేర్కొంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube