దేశంలో ఇన్నాళ్లుగా ఉగ్రవాద దాడులు లేవు.కానీ తాజాగా జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ లో విరుచుకుపడిన ఊగ్రవాదుల దాడి కలకలాన్ని సృష్టిస్తుంది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్లితే.
జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ శివారు ప్రాంతమైన అరిభాగ్లో బీజేపీ నేత అన్వర్ఖాన్ ఇంటిపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు.
దాడిలో అన్వర్ ఖాన్ సురక్షితంగా బయటపడగా, ఆయన ఇంటి వద్ద విధుల్లో ఉన్న ఒక కానిస్టేబుల్ మృతి చెందినట్టు పోలీసుల సమాచారం.
కాగా ఈ దాడి ఈరోజు ఉదయం సుమారు 11.30 గంటలకు జరిగినట్టు సమాచారం.ఇకపోతే ఈ కాల్పుల్లో మృతి చెందిన కానిస్టేబుల్ను రమ్జీత్ రాజా గా గుర్తించినట్టు ఉన్నతాధికారులు వెల్లడించారు.
ఇక దాడి జరిగిన ఈ ప్రాంతంలో పోలీసులు, భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయని పూర్తి వివరాలు త్వరగానే వెల్లడిస్తామని అధికారులు పేర్కొంటున్నారు.