కన్నడ, తెలుగు, హిందీ భాషల్లో ఇప్పటికే స్టార్ హీరోయిన్ గా గుర్తింపును సంపాదించుకున్నారు రష్మిక మందన్నా కోలీవుడ్ ఇండస్ట్రీలో సుల్తాన్ సినిమాతో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది.
ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన రష్మిక ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడుతూ మాస్క్ గురించి సోషల్ డిస్టెన్స్ గురించి ప్రశ్నించారు.చెన్నైలో తనను సుల్తాన్ మూవీ చిత్రయూనిట్ ఎంతో బాగా చూసుకుందని ఆమె అన్నారు.
కార్తీని హైదరాబాద్ ప్రేక్షకులు బాగా చూసుకోవాలని ఈ ప్రదేశం గురించి, ఇక్కడి ప్రేక్షకుల గురించి తాను చెన్నైలో బాగా బిల్డప్ ఇచ్చానని రష్మిక అన్నారు.ముంబైలో సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న రష్మిక అభిమానులు సూర్య, కార్తీ పేర్లను పిలుస్తూ ఉండటంతో తనను మాట్లడనివ్వాలని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.
ఫ్యాన్స్ రష్మిక రష్మిక అంటూ గోలగోల చేశారు.అయితే అభిమానులపై సీరియస్ కాకుండా రష్మిక స్వీట్ వార్నింగ్ ఇవ్వడం గమనార్హం.
రేపు విడుదల కాబోతున్న సుల్తాన్ సినిమాపై ప్రేక్షకుల్లో బాగానే అంచనాలు నెలకొన్నాయి.ఊపిరి తరువాత సరైన హిట్ లేని కార్తీ ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వస్తాడని అతని ఫ్యాన్స్ భావిస్తున్నారు.రేపు వైల్డ్ డాగ్ సినిమాతో పాటు ఈ సినిమా కూడా విడుదల కానుంది.రష్మిక ఈ సినిమాలో పల్లెటూరి యువతిగా కనిపిస్తుండటం గమనార్హం.ఈ సినిమాలో రష్మిక గతంలో పోషించిన పాత్రలకు భిన్నమైన పాత్రను పోషిస్తున్నారు.
రష్మిక కోలీవుడ్ లో నటిస్తున్న ఈ సినిమా సక్సెస్ సాధిస్తే రష్మికకు కోలీవుడ్ ఇండస్ట్రీలో మరిన్ని ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది.
చాలామంది హీరోయిన్లు సక్సెస్ లేక కెరీర్ విషయంలో ఇబ్బందులు పడుతుంటే రష్మిక మాత్రం వరుస ఆఫర్లను అందిపుచ్చుకుంటూ ఉండటం గమనార్హం.