పశ్చిమ బెంగాల్లో నేడు రెండో విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్న నేపధ్యంలో ఇక్కడ బాంబులు ఉన్నాయన్న వార్త కలకలాన్ని సృష్టిస్తుంది.కాగా ఇక్కడి నుంచి సీఎం మమతా బెనర్జీ పోటీలో ఉండగా బీజేపీ నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి ఆమెకు గట్టిపోటీ ఇస్తున్నారు.
ఈ పోటీ నువ్వా నేనా అన్నట్లుగా ఇద్దరి మధ్య కొనసాగుతుంది.
ఇకపోతే దేశవ్యాప్తంగా హాట్టాపిక్గా మారిన నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా ఇవాళే పోలింగ్ జరుగుతున్న విషయం విదితమే ఈ క్రమంలో కేశ్పూర్ ప్రాంతంలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 17 బాంబులు గుర్తించినట్లు సమాచారం.
వెంటనే అప్రమత్తం అయిన బాంబు స్క్వాడ్ సిబ్బంది ఆ బాంబులను నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి నిర్వీర్యం చేసారట.కాగా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని, నిందితులను గుర్తించే పనిలో పడ్డారట.