బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి చెంది తొమ్మిది నెలలైన సంగతి తెలిసిందే.సుశాంత్ మరణాన్ని ఆయన అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.
సుశాంత్ మృతికి సంబంధించి వాస్తవాలు ఇప్పటికీ వెలుగులోకి రాలేదని సుశాంత్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అయితే తాజాగా సుశాంత్ ఫ్యాన్స్ సుశాంత్ మాజీ లవర్ అంకితా లోఖండేను టార్గెట్ చేశారు.
ఈ నెల 29వ తేదీన హోలీ పండుగ సందర్భంగా అంకిత తన బాయ్ ఫ్రెండ్ అయిన విక్కీ జైన్ తో కలిసి హోలీ పండుగను సెలబ్రేట్ చేసుకోవడంతో పాటు ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.సుశాంత్ మృతి చెంది కొన్ని నెలలైనా గడవక ముందే సంతోషంగా బాయ్ ఫ్రెండ్ తో అంకిత చిందులేయడంపై సుశాంత్ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు మండిపడుతున్నారు.
సుశాంత్ చనిపోయి ఏడాదైనా కాకముందే హోలీ పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నావంటూ ప్రశ్నిస్తున్నారు.
తాము సుశాంత్ అభిమనులం కావడం వల్ల హోలీ వేడుకలకు దూరంగా ఉన్నామని.
నువ్వు సుశాంత్ ప్రియురాలివైనా సంవత్సరం కూడా ఆగలేకపోయావా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.మరి కొందరు అంకిత మహానటి అని సుశాంత్ గురించి అంకిత చెప్పిన మాటల్లో నిజం లేదని పేర్కొన్నారు.
సుశాంత్ ఫ్యాన్స్ ట్రోల్స్ విషయంలో అంకిత ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపును సంపాదించుకున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతికి నెపోటిజం కారణమని కొందరు అభిప్రాయపడుతుంటే సుశాంత్ డిప్రెషన్ వల్ల ఆత్మహత్య చేసుకున్నాడని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు.
సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదని అతడిని హత్య చేశారని మొదట్లో అనుమానాలు వ్యక్తమైనా పోలీసుల విచారణలో సుశాంత్ అత్మహత్య చేసుకున్నట్టు నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే.