దేశంలో కరోనా వైరస్ విజృంభణ తీవ్ర స్థాయిలో ఉందన్న సంగతి తెలిసిందే.ఊహించని విధంగా గత రెండు వారాల నుండి పాజిటివ్ కేసులు పెరిగిపోవటం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పెన్షన్ పుట్టిస్తోంది.
మరోపక్క కరోనా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఎవ్వరినీ కనికరించడం లేదు.ఇప్పటికే చాలా మంది కరోనా బారిన పడటం జరిగింది.
ఇదిలా ఉంటే తాజాగా జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత సీనియర్ ఎంపీ ఫరూక్ అబ్దుల్లా కరోనా బారిన పడ్డారు.ఈ విషయాన్ని ఆయన కుమారుడు మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ట్విట్ చేశారు.
ఫరూక్ అబ్దుల్లా కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ జరిగిందని, ఇటీవల కొన్ని లక్షణాలు ఉండటం వల్ల టెస్టుల్లో బయటపడిందని పేర్కొన్నారు.ప్రస్తుతం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.
తాను కూడా క్వారంటైన్ లో ఉంటున్నట్లు
.