కరోనా సెకండ్ వేవ్ తో దేశ వ్యాప్తంగా మళ్లీ కేసుల సంఖ్య భారీ ఎత్తున పెరుగుతున్నాయి.గత ఏడాది మార్చి వరకు కేసుల సంఖ్య చాలా వరకు తగ్గడంతో హమ్మయ్య అంటూ అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు.
ఇలాంటి సమయంలో మళ్లీ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఏకంగా లాక్ డౌన్ లు కర్ఫ్యూ లు ఇంకా రక రకాలుగా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు.ఇదే సమయంలో కరోనా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలంటూ సూచనలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు వరుసగా కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తుంది.బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు ఎంతో మంది ఇప్పటికే కరోనా బారిన పడ్డారు.
ఇప్పుడు సెకండ్ వేవ్ సందర్బంగా కూడా కరోనా బారిన పడుతూ ఉన్నారు.
ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు కారు డ్రైవర్ గా చేసే వ్యక్తికి కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యింది.
దాంతో మహేష్ కుటుంబ సభ్యులు అందరితో పాటు వారి ఇంట పని చేసే ప్రతి ఒక్కరు కూడా కరోనా టెస్ట్ చేయించుకున్నారు.ఇదే సమయంలో కరోనా సోకిన డ్రైవర్ తో దగ్గర కాంటాక్ట్ ఉన్న వారు స్వీయ నిర్భందంలోకి వెళ్లి పోయారు.
మొత్తంగా మహేష్ బాబు ఇల్లు అంతా కూడా వైధ్యుల దిగ్బందంలో ఉన్నట్లుగా మారిపోయింది.మహేష్ బాబు కుటుంబ సభ్యులకు సంబంధించిన రిపోర్ట్ కోసం అంతా వెయిట్ చేస్తున్నారు.
ఇక మహేష్ బాబు త్వరలో సర్కారు వారి పాట సినిమా చిత్రీకరణ లో పాల్గొనేందుకు సిద్దం అవుతున్నాడు.ఇలాంటి సమయంలో ఆయన డ్రైవర్ కు ఇలా జరగడంతో సినిమా షూటింగ్ కు ఏమైనా అవాంతరం ఎదురయ్యేనా అంటున్నారు.
మహేష్ బాబుకు సహజంగా చాలా జాగ్రత్తలు తీసుకుని ఉంటాడు కనుక ఖచ్చితంగా మహేష్ కు నెగటివ్ రాబోతుంది.కనుక మహేష్ బాబు సర్కారు వారి పాట షూటింగ్ కు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు అంటున్నారు.