అవతలి వారు ఎంతటి వారు అయినా సరే ఏదైనా మంచి పని చేస్తే వారిని ప్రశంసించడంలో ముందుంటారు మన భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ.ఈ క్రమంలో తాజాగా మన్ కీ బాత్ కార్యక్రమంలో నరేంద్ర మోడీ కోవై కి చెందిన ఒక బస్సు కండక్టర్ పై ప్రశంసల వర్షం కురిపించారు.
ఇంతకు నరేంద్ర మోడీ ప్రశంసించే విధంగా ఆ కండక్టర్ ఏమి చేశారు అని అనుకుంటున్నారా ? కోవై కు చెందిన యోగనాథన్ అనే బస్సు కండక్టర్ తనతో పాటు బస్సులో ప్రయాణికులకు టికెట్ తో పాటు మొక్కలను కూడా అందిస్తున్నారని, అలాగే తనకు వచ్చిన ఆదాయంలో 40 శాతం ఈ పనికి వినియోగిస్తున్నట్లు తెలిపారు మోడీ.
ఈ సందర్భంగా యోగనాథన్ మాట్లాడుతూనరేంద్ర మోడీ తన గురించి ఇలా మాట్లాడటం చాలా సంతోషకరంగా ఉందని, అలాగే ఎంతో ప్రోత్సాహకరంగా ఉందని పేర్కొన్నాడు.
ఇక ఆయన 34 సంవత్సరాలుగా బస్సు కండెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నట్లు, ఇప్పటివరకు మూడు లక్షలకు పైగా మొక్కలను నాటినట్లు పేర్కొన్నాడు.గత సంవత్సరం దాదాపు 85 వేల మొక్కలను ఉచితంగా అందరికీ పంపిణీ చేసినట్లు, అలాగే ఇప్పటి వరకు అనేక అవార్డులను సొంతం చేసుకున్నట్లు తెలిపారు.
ఇంకో ఆశక్తి కరమైన విషయం ఏమిటి అంటే.ఆయన ఇప్పటి వరకు కూడా అద్దె ఇంట్లోనే నివాసం ఉండటం .ప్రస్తుతం ఇందుకు సంబందించిన కధనం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.