విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉద్యమం విషయంలో కీలకంగా వ్యవహరిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం అందరికీ తెలిసిందే.ఇలాంటి పరిస్థితుల్లో ఆయన మొదటి నుండి పార్టీ మారే అవకాశం ఉందని వార్తలు వస్తున్న తరుణంలో తాజాగా తిరుపతి ఉప ఎన్నిక పై కీలక కామెంట్లు చేశారు.
కచ్చితంగా ఈ ఉప ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అని పేర్కొన్నారు.
ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో .పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అందరికీ అర్థం అవుతుందని తెలిపారు.అయితే తిరుపతి బై పోల్ లో కార్యకర్తలు కృషి తో టిడిపి గెలవటం గ్యారెంటీ అని, రెండు వారాల సమయం ఉండటంతో టిడిపి పార్టీకి చెందిన అగ్ర నేతల ప్రచారం.
పార్టీకి పాజిటివ్ ఫలితాలు తీసుకు వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.టీడీపీ పార్టీకి బలం కార్యకర్తలని, మళ్లీ టీడీపీకి పూర్వ వైభవం ఖచ్చితంగా వస్తుంది అని గంట శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు.
ఈ ఉప ఎన్నికలలో టిడిపి పార్టీ తరుపున కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి పోటీ చేస్తూ ఉన్నారు.ఉప ఎన్నికలలో ఖచ్చితంగా సత్తా చాటాలని అధ్యక్షుడు చంద్రబాబు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయడం జరిగింది.