నాగార్జునసాగర్ ఉపఎన్నికను తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టంగా తీసుకున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో దక్కిన విజయంతో జోష్లో ఉన్న తెరాస ప్రస్తుతం ఇక్కడి అభ్యర్థి ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తోందని తెలుస్తుంది.
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలన్న లక్ష్యంతో వ్యూహా, ప్రతివ్యూహాలకు పదును పెడుతోంది.
ఇక గులాభి నేతలైతే తమ దూకుడును ప్రదర్శించడం ఎప్పుడో స్టార్ట్ చేశారు.
ఇదిలా ఉండగా నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ తరఫున సీనియర్ నేత జానారెడ్డి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సందర్భంగా జానారెడ్డి నిన్న టీఆర్ఎస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడుతూ, కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లిందని విమర్శించారు.
నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో ఓటమి భయంతో జానారెడ్డికి వెన్నులో వణుకుపుట్టి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.ఇకపోతే వచ్చేనెల 17న జరగనున్న ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా పార్టీలు ప్రచారం చేసుకుంటున్న క్రమంలో ఇలా ఒకరి పై ఒకరు తీవ్రమైన ఆరోపణలతో ముందుకు వెళ్లుతున్నారు.