మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సందర్బంగా నిన్న శిల్ప కళా వేదికలో మెగా అభిమానులు పెద్ద ఎత్తున వేడుక నిర్వహించారు.ఆల్ ఇండియా మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో మెగా బ్రదర్స్ మేనల్లుడు అయిన సాయి ధరమ్ తేజ్ మరియు వైష్ణవ్ తేజ్ లు హాజరు అయ్యారు.
వీరిద్దరు కూడా చరణ్ బర్త్ డే వేడుక లో కేక్ ను కట్ చేసి తమ శుభాకాంక్షలను తెలియజేశారు.ఈ వేడుకలో బిగ్ బాస్ 3 బ్యూటీ దివి కూడా పాల్గొని సందడి చేసింది.
ఇక ఇంద్ర సినిమాలో చిన్న ఇంద్ర సేనా రెడ్డిగా నటించిన తేజ సజ్జ కూడా పాల్గొన్నాడు.ఇంకా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో చాలా సరదాగా సాగింది.
కాని ఈ బర్త్ డే వేడుకల్లో ఇతర మెగా హీరోలు పాల్గొనక పోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
రామ్ చరణ్ మరియు అల్లు అర్జున్ల మద్య వైరం అంటూ గతంలో చాలా సార్లు పుకార్లు షికార్లు చేశాయి.
అందుకే ఈ వేడుకలో ఆయన పాల్గొనలేదేమో అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.మరి కొందరు ఈ వేడుకలో వారు పాల్గొనక పోవడంపై కొందరు కామెంట్స్ చేస్తున్నారు.ప్రస్తుతం అల్లు అర్జున్ మరియు అల్లు శిరీష్ లు వారి వారి పనులతో బిజీగా ఉన్నారు.అందుకే ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు అంటున్నరు.
ముఖ్యంగా అల్లు అర్జున్ అందుబాటులో ఉండి ఉంటే తప్పకుండా హాజరు అయ్యేవాడని కాని ఆయన షూటింగ్ తో బిజీ గా ఉండటం వల్లే రాలేదని అంటున్నారు. మెగా ఫ్యామిలీకి చెందిన ఇతర హీరోలు కూడా వచ్చే అవకాశం ఉన్నా కూడా వారు ఎందుకు రాలేదు అంటున్నారు.
రామ్ చరణ్ మరియు చిరంజీవి కలిసి నటిస్తున్న ఆచార్య సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా మే లో రాబోతుంది.