దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న అసంతృప్తి తెలిసిందే.రోజురోజుకీ ఊహించని విధంగా కేసుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ కరోనా బారిన పడుతున్నారు.
వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా గానీ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అవుతున్నాయి.కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నాయి.
పరిస్థితి ఇలా ఉండగా తాజాగా క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కి కరోనా పాజిటివ్ వచ్చింది.ఈ విషయాన్ని స్వయంగా ఆయనే సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
ఇటీవల కరోనా కి సంబంధించిన కొన్ని లక్షణాలు కనిపించడంతో వెంటనే టెస్టులు నిర్వహించగా పాజిటివ్ రిపోర్ట్ వచ్చినట్లు స్పష్టం చేశారు.ఇదే పరీక్షల్లో కుటుంబ సభ్యులకు నెగిటివ్ వచ్చినట్లు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ఇంటిలోనే హోమ్ ఐసోలేషన్ లో ఉన్నట్లు పేర్కొన్నారు సచిన్.ఈ వార్త రావటంతో సచిన్ టెండూల్కర్ అభిమానులు క్రికెట్ ప్రేమికులు .సచిన్ మహామారి నుండి త్వరగా కోలుకోవాలని భగవంతునికి ప్రార్థనలు చేస్తున్నారు.