జాతి రత్నాలు సినిమా తో విడుదల అయిన శ్రీకారం మరియు ఇతర సినిమాలు సోదిలోకి లేకుండా పోయాయి.ఆ సినిమా లు ఆడే అవకాశం కూడా కనిపించలేదు.
దాంతో ఆ వారం మొత్తం కూడా జాతి రత్నాలు సినిమా కుమ్మేసుకుంది.ఇక గత వారం మోసగాళ్లు సినిమాతో పాటు మరి కొన్ని సినిమాలు వచ్చాయి.
కాని ఏ ఒక్కటి కూడా ఆకట్టుకోక పోవడంతో జాతి రత్నాలు సినిమా రెండవ వారంలో కూడా కుమ్మేసింది.మొదటి వారంకు ఏమాత్రం తగ్గకుండారెండవ వారంలో కూడా వసూళ్లు నమోదు అయిన విషయం తెల్సిందే.
ఇక నేటి నుండి కొత్త సినిమాలు బాక్సాఫీస్ వద్దకు వచ్చేశాయి.ముఖ్యంగా రంగ్ దే మరియు అరణ్య సినిమా లు భారీ అంచనాల నడుమ విడుదల అయ్యాయి.
మరి ఆ సినిమా లు ఎలా ఉన్నాయి.జాతి రత్నాలు జోరుకు ఆ సినిమాలు బ్రేక్ వేశాయా అనేది ఆసక్తికరంగా మారింది.
ఇప్పటి వరకు అందిన ట్రేడ్ రిపోర్ట్ ను బట్టి అరణ్య సినిమా ను జనాలు చూసేందుకు పెద్దగా స్కోప్ లేదు.ఇక రంగ్ దే సినిమా ను ఫ్యామిలీ ఆడియన్స్ చూసేందుకు కాస్త స్కోప్ అయితే ఉంది.
రంగ్ దే సినిమా టాక్ గురించి చెప్పాలంటే అభిమానులను కాస్త పర్వాలేదు అన్నట్లుగా ఎంటర్ టైన్ చేసినా కూడా సామాన్య ప్రేక్షకులు మాత్రం పెదవి విరుస్తున్నట్లుగా టాక్ వినిపిస్తుంది.ఈ విషయమై పెద్ద ఎత్తున అంచనాలు ఉన్న అరణ్య సినిమా ను కూడా తీసుకుంటే ఆ సినిమా వసూళ్లు కనీసం రెండు మూడు కోట్లు అయినా నమోదు అవ్వడం కష్టం అంటున్నారు.
ఇలాంటి సమయంలో అరణ్య లాంటి సినిమాలను జనాలు చూడాలనుకోవడం లేదు అనేది నిజం.కనుక ఈ వారంలో వచ్చిన రంగ్ దే సినిమా కాస్త లో కాస్త జాతి రత్నాలకు బ్రేక్ వేసే అవకాశాలు ఉన్నాయి.
రంగ్ దే ఒక రోజు రిపోర్ట్ వచ్చిన తర్వాత కాని అసలు విషయాన్ని చెప్పలేం.