1.లాక్ డౌన్ పై కేసీఆర్ క్లారిటీ
తెలంగాణలో కరోనా వైరస్ కు దూరం అవుతున్న నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తారు అనే వార్తలపై సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు.ఎట్టి పరిస్థితుల్లోనూ లాక్ డౌన్ విధించే ఆలోచన ఏదీ లేదు అని క్లారిటీ ఇచ్చారు.
2.అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత
తెలంగాణ అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.అసెంబ్లీ ముట్టడికి వచ్చిన విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడం తో విద్యార్థులు, పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది.
3.40 ఇంటర్ కాలేజీల మూసివేత
అమలులో ఉన్న ఈ నిబంధనలు పాటించని నలభై జూనియర్ కళాశాలను ఈ విద్యా సంవత్సరం నుంచి మూసివేసినట్టు తెలంగాణ హై కోర్ట్ కు ప్రభుత్వం తరపున స్పెషల్ జిపి సంజీవ్ కుమార్ తెలిపారు.
4.తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ఉదయం ప్రారంభమైయ్యాయి.
5.ఎంపి రామ్మోహన్ నాయుడు ఫ్లెక్సీ కి పాలాభిషేకం
స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతు తెలిపిన శ్రీకాకుళం టీడీపీ ఎంపి రామ్మోహన్ నాయుడు ఫ్లెక్సీ కి విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమ కార్మికులు పాలాభిషేకం చేశారు.
6.465 వ రోజుకి అమరావతి ఆందోళనలు
అమరావతిలోనే ఏపీ రాజధానిని కొనసాగించాలి అని రైతులు, మహిళలు చేపట్టిన ఆందోళనలు నేటితో 465 వ రోజుకి చేరుకున్నాయి.
7.నూజివీడు లో శ్రీ సిటీ ఏర్పాటు
నూజివీడు లో శ్రీ సిటీ ఏర్పాటు కు చర్యలు తీసుకుంటున్నట్టు ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ మురళీ కృష్ణ తెలిపారు.
8.బడ్జెట్ ఆర్డినెన్సు కు ఏపీ క్యాబినెట్ ఆమోదం
బడ్జెట్ ఆర్డినెన్సు కు ఏపీ క్యాబినెట్ కొద్దిసేపటి క్రితమే ఆమోదం తెలిపారు.
9.రాష్ట్రపతికి స్వల్ప అస్వస్థత
భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.చాతిలో కాస్త ఇబ్బందులు ఏర్పడడంతో ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో ఆయన చేరారు.
10.భారత్ లో కరోనా
భారత్ లో కరోనా వైరస్ ప్రభావం తీవ్రతరం అవుతోంది.గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 59,118 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
11.2036 వరకూ రష్యా అధ్యక్షుడిగా పుతిన్
రష్యా అధ్యక్షుడిగా మరో రెండు దఫాలు కొనసాగేందుకు పుతిన్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.దీనికి సంబందించిన బిల్లు ను ఆ దేశ దిగువ సభ ఆమోదించింది.
12.బంగ్లా దేశ్ కు చేరుకున్న పుతిన్
భారత ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ కు చేరుకున్నారు.ఆదేశ ప్రధాని షేక్ హసీనా ప్రధానికి స్వాగతం పలికారు.
13.వేలానికి 67 బొగ్గు గనులు
కేంద్ర ప్రభుత్వం వేలానికి 67 బొగ్గు గనులను పెట్టింది.
14.ఒకే ఇంట్లో 21 మందికి కరోనా
తూర్పు గోదావరి జిల్లా తొండంగిలో కరోనా కలకలం రేపింది.
ఉమ్మడి కుటుంబంలో ఉన్న 21 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.వీరంతా ఇటీవల ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లి వచ్చారు.
15.ఎంపీ ధర్మపురి అరవింద్ పై షర్మిల కామెంట్స్
నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాల రైతులతో భేటీ అయిన వైఎస్ షర్మిల బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పై కామెంట్స్ చేసారు.ఎవరో నిజామాబాద్ కు పసుపు బోర్డ్ తెస్తాను అన్నారట.ఎవరో బాండ్ పేపర్ ఇచ్చారట అంటూ సెటైర్స్ వేశారట.
16.మాలివుడ్ నటుడు పిసి సోమన్ మృతి
మాలీవుడ్ నటుడు పిసి సొమన్ (81) అనారోగ్యం తో మృతి చెందారు.
17.చిన్నారులపై ఫైజర్ ట్రైల్స్
చిన్నారులకు కరోనా టీకా అందించేందుకు ఫైజర్ సంస్థ సిద్ధం అవుతోంది.
18.మళ్లీ లాక్ డౌన్
ప్రజలు సహకరించకపోతే మళ్లీ లాక్ డౌన్ విధిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది.
19.భైన్ స్టోక్స్ కు అంపైర్ల మందలింపు
ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బైన్ స్టోక్స్ తన అలవాటు మార్చుకోలేకపోతున్నారు.బంతికి ఉమ్ము రాస్తూ మరోసారి దొరికిపోయాడు.దీనిపై ఎంపైర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర -41,700
24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 45,490
.