భారత రాష్ట్రపతి అయినా రామ్నాథ్ కోవింద్ కు స్వల్ప అస్వస్థత కలగడంతో ఆస్పత్రికి తరలించారని సమాచారం.ఈరోజు ఉదయం ఛాతీలో అసౌకర్యంగా ఉందని తెలపడం తో సిబ్బంది ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారట.
ప్రస్తుతం ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారని అధికార వర్గాల సమాచారం.ఈ క్రమంలో కొన్ని సాధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆర్మీ ఆర్ అండ్ ఆర్ హాస్పిటల్ మెడికల్ బులెటిన్ తెలిపింది.
ప్రస్తుతం ఆర్మీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న రాష్ట్రపతి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.
ఇదిలా ఉండగా రామ్నాథ్ కోవింద్ ఇటీవల కరోనా మొదటి టీకా ఇప్పించుకున్న విషయం తెలిసిందే.
ఈ క్రమం లో కోవింద్ అనారోగ్యానికి గురవడంతో కొంత ఆందోళన నెలకొన్న ప్రస్తుతం ఆయన ఆరోగ్యానికి ఇబ్బంది లేదని వైద్యులు తెలుపడం తో ఊపిరి పీల్చుకున్నారట సిబ్బంది.