కరోనా లాక్ డౌన్ తర్వాత సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన మాస్ మహారాజ్ రవితేజ సినిమా క్రాక్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.50 పర్సెంట్ ఆక్యుపెన్సీతోనే ఈ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది.అలాగే రవితేజ కెరియర్ లో హైయెస్ట్ కలెక్షన్ రాబట్టిన సినిమాగా క్రాక్ నిలిచింది.హ్యాట్రిక్ ఫ్లాప్ ల తర్వాత రవితేజ ఎనర్జీ లెవల్స్ కి సరిపోయే కథని గోపీచంద్ మలినేని క్రాక్ సినిమా ద్వారా ప్రెజెంట్ చేశాడు.
పక్కా మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా మాస్ జనాలని విశేషంగా అలరించింది.ఒంగోలులో వాస్తవంగా జరిగిన కొన్ని సంఘటనలని, అక్కడున్న పాత్రలని స్పూర్తిగా తీసుకొని ఈ కథని గోపీచంద్ సిద్ధం చేసి తెరపై ఆవిష్కరించాడు.
ఇదిలా ఉంటే క్రాక్ థియేటర్ లో రిలీజ్ అయిన నెల రోజులకె డిజిటల్ లో ఆహాలో రిలీజ్ అయ్యి అక్కడ కూడా ఎక్కువ మందిని అలరించింది.రవితేజ కెరియర్ లో మాసివ్ హిట్ మూవీగా నిలిచినా ఈ సినిమా తాజాగా టెలివిజన్ లో కూడా ప్రసారం అయ్యి టీవీ ప్రేక్షకులని కూడా అలరించింది.
ఈ సినిమా మహాశివరాత్రి తర్వాత మార్చ్ 14న టీవీలో ప్రసారం అయింది.థియేటర్స్, ఓటిటి మాదిరిగానే టీవీలలో కూడా అదిరిపోయే ఆదరణ క్రాక్ సినిమా దక్కించుకుంది.స్టార్ మా ఛానల్ లో ప్రసారమైన క్రాక్ మూవీ.11.7 టీఆర్పీ రేటింగ్ నమోదు చేసింది.ఈమధ్య రవితేజ కెరీర్లో మంచి రేటింగ్ సాధించిన సినిమాగా రికార్డులోకెక్కింది.
మొత్తానికి మూడు చోట్ల అన్ని వర్గాల ప్రేక్షకుల అలరించిన చిత్రంగా క్రాక్ సినిమా రవితేజ కెరియర్ లో నిలిచిపోతుందని చెప్పాలి.ప్రస్తుతం రవితేజ రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ సినిమాలో నటిస్తున్నాడు.
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది.