సూపర్ స్టార్మహేష్ బాబు హోమ్ బ్యానర్ లో అడవి శేష్ హీరోగా మేజర్ అనే సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.ముంబై టెర్రర్ ఎటాక్స్ లో ప్రాణాలు వదిలిన మేజర్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.
పాన్ ఇండియా మూవీగా దీనిని ఆవిష్కరిస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు.
శశికిరణ్ తిక్కా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా టీజర్ ని మార్చి 28న ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తామని చిత్ర యూనిట్ గతంలో క్లారిటీ ఇచ్చింది.
అయితే ప్రస్తుతం టీజర్ రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు అడవి శేష్ సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చాడు.కరోనా సిచువేషన్ తో పాటు, దర్శకుడు ఇంట్లో విషాదం కారణంగా టీజర్ రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ క్లారిటీ ప్రకటించింది.
ప్రస్తుతం మహారాష్ట్రలో కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి.దేశంలోనే అత్యధిక కేసులు ఆ రాష్ట్రంలోనే రావడం గమనార్హం.ఈ నేపధ్యంలో ముంబైలో జరుగుతున్న సినిమా షూటింగ్ లతో పాటు, బాలీవుడ్ మూవీ రిలీజ్ లు కూడా వాయిదా పడ్డాయి.కరోనా సెకండ్ వేవ్ ముంబైలో తీవ్ర ప్రభావం చూపిస్తుంది.
ఈ నేపధ్యంలో మేజర్ షూటింగ్ కూడా వాయిదా పడినట్లు తెలుస్తుంది.ఈ కారణంగానే టీజర్ రిలీజ్ ని పోస్ట్ పోన్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది.
మరో వైపు కరోనా తీవ్రత రోజు రోజుకి ఎక్కువ అవుతూ ఉండటం వలన జులై2 అనుకున్న ఈ సినిమా రిలీజ్ అయినా ఆ టైంకి జరుగుతుందా అనేది సందేహాస్పదంగా మారింది.మొత్తానికి కరోనా సెకండ్ వేవ్ టాలీవుడ్ అందరికంటే ముందుగా సూపర్ స్టార్ మేజర్ సినిమాని తాకిందనే టాక్ ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్ లో వినిపిస్తుంది.