తెలుగులో ఒకప్పుడు గులాబీ, నిన్నే పెళ్లాడతా, మురారి, గోవిందుడు అందరివాడేలే, తదితర చిత్రాలకు దర్శకత్వం వహించి ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగానే అలరించిన ప్రముఖ సినీ దర్శకుడు “కృష్ణ వంశీ” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు… కాగా తాజాగా దర్శకుడు కృష్ణ వంశీ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని తన భార్య రమ్య కృష్ణతో పెళ్లి ఎలా జరిగిందని మరియు టాలీవుడ్ సీనియర్ హీరో జె.డి.చక్రవర్తితో తనకి గొడవ జరగడానికి కారణం ఏమిటనే విషయాలు గురించి పాఠకులతో పంచుకున్నారు.
అయితే డైరెక్టర్ కృష్ణ వంశీ తాను గులాబీ చిత్రం తెరకెక్కిస్తున్న సమయంలో ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్న జె.
డి.చక్రవర్తి తో గొడవ జరిగిన మాట వాస్తవమేనని అయితే ఈ గొడవకి కారణం చిన్నపాటి అవగాహన లోపమని అలాగే పరోక్షంగా హీరోయిన్ మహేశ్వరి కారణం అయినప్పటికీ ప్రస్తుతం తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని మంచి స్నేహితులుగా ఉన్నామని తెలిపారు.అలాగే రమ్య కృష్ణని మొదటగా నిన్నే పెళ్ళాడుతా చిత్రం షూటింగ్ జరుగుతున్న సమయంలో చూశానని ఆ సమయంలో ఇతరుల ద్వారా ఇద్దరికీ పరిచయం ఏర్పడిందని కానీ అతి కొద్ది సమయంలోనే ఈ పరిచయం కాస్తా పరిణయానికి దారి తీసిందని చెప్పుకొచ్చాడు.
కానీ ఎప్పుడూ కూడా తాము ఇరువురు ప్రేమిస్తున్నట్లు ఒకరికొకరు చెప్పుకోలేదని తమ ఇద్దరి మధ్య ఉన్నటువంటి బంధమే ఒకటి చేసిందని చెప్పు కొచ్చాడు.అలాగే ఒక బంధం కలవాలని ఉంటే కచ్చితంగా కలుస్తారని అలా కాకుండా ఇష్టం లేని వ్యక్తులను కలపాలని ప్రయత్నిస్తే పెద్దగా ఫలితం ఉండదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు….అంతేగాక రమ్య కృష్ణ చాలా ముక్కు సూటిగా మాట్లాడుతుందని అందువల్లనే తనకి తన భార్యంటే చాలా ఇష్టమని పేర్కొన్నాడు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం కృష్ణ వంశీ తెలుగులో రంగ మార్తాండ అనే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ చిత్రంలో సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ మరియు రమ్య కృష్ణ ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.
ఆ మధ్య కృష్ణవంశీ దర్శకత్వం వహించిన నక్షత్రం చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫ్లాప్ అయింది.దీంతో ఈ సారి కథ విషయంలో కృష్ణ వంశీ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.