రాజకీయాల్లో గెలుపు ఓటములు సర్వసాధారణం.కానీ ఈ విజయాన్ని మాత్రం టీఆర్ఎస్ నేతలు ఏదో అసాధ్యం కాని విజయాన్ని పొందినట్లుగా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు.
నిన్న తెలంగాణ భవన్లో అగ్నిప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.దీనికి కారణం ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాభి పార్టీ అభ్యర్ధులు గెలవడం.
అయితే ఇదే విషయంలో తాజాగా మరో సారి కలకలం చెలరేగింది.
ఇకపోతే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ శ్రేణులు భారీగా సంబరాలు చేసుకుంటున్నారు.ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్ యాదవ్ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ, తుపాకీ తీసి విజయసూచకంగా గాల్లోకి కాల్పులు జరిపేందుకు ప్రయత్నించారు.
కాగా అక్కడున్న నేతలు వెంటనే అప్రమత్తం అయ్యి శ్రీనివాస్ యాదవ్ ను కాల్పులు జరపకుండా నిలువరించారు.లేకుండా ఆయన గాల్లోకి కాల్పులు జరిపే వారు.మరి బాధ్యతగల వ్యక్తులే ఇలాంటి పనికి మాలిన పనులు చేస్తుంటే బాధ్యత ఎరుగని యువకులు అడ్దదారుల్లో వెళ్లడం పెద్ద ఆశ్చర్యం కాదని ఈ విషయం తెలిసిన వారు చెవులు కొరుక్కుంటున్నారట.