మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి సుప్రీం హీరో అనే బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకున్న నటుడు సాయి ధరమ్ తేజ్.కెరియర్ ఆరంభంలో హ్యాట్రిక్ హిట్స్ కొట్టి మంచి జోరు మీద కనిపించిన తేజ్ తరువాత ఏకంగా ఐదు ఫ్లాప్ లతో డీలా పడ్డాడు.
మళ్ళీ చిత్రలహరి, ప్రతిరోజు పండగే, సోలో బ్రతుకే సొ బెటరు సినిమాలతో హిట్స్ కొట్టాడు.ఇప్పుడు ఒకే సారి ఇద్దరు దర్శకులతో సినిమాలు చేస్తున్నాడు.
అందులో దేవకట్టా దర్శకత్వంలో పెట్రియాటిక్ స్టొరీతో చేస్తున్నాడు.ఇందులో స్టూడెంట్ లీడర్ గా తేజ్ కనిపించనున్నాడు.
అలాగే కార్తీక్ దండు దర్శకత్వంలో ఒక పీరియాడిక్ మూవీలో నటిస్తున్నాడు.ఈ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే అయిపొయింది.
అలాగే ప్రీలుక్ కూడా రిలీజ్ చేశారు.తేజ్ కెరియర్ లో ఇప్పటి వరకు చేయనటువంటి సరికొత్త కథాంశంతో ఈ సినిమా ఉండబోతుంది.
ఇదిలా ఉంటే త్వరలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి దర్శకుడు రెడీ అవుతున్నాడు.
ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన క్యాస్టింగ్ ని ఫైనల్ చేసే పనిలో ఉన్నారు.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా మలయాళీ భామని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.ఈ మధ్యకాలంలో మల్లు బ్యూటీస్ టాలీవుడ్ పై దండయాత్ర చేస్తున్నారు.కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్, అనూ ఇమ్మాన్యూయేల్, మాళవిక నాయర్, మాళవిక మోహనన్ వంటి మల్లు బ్యూటీస్ తెలుగులో అవకాశాలు దక్కించుకుంటున్నారు.ఇప్పుడు మరో మల్లు బ్యూటీ సంయుక్త మీనన్ ని తేజ్ కి జోడీగా నటించబోతుంది.
ఈ అమ్మడు తేజ్ సినిమాతో పాటు కళ్యాణ్ రామ్, మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కబోతున్న పీరియాడిక్ మూవీలో కూడా హీరోయిన్ గా కన్ఫర్మ్ అయ్యింది.ఇప్పుడు తేజ్ సినిమా కోసం ఈ భామనే ఎంపిక చేశారు.
వీటితో పాటు తెలుగు, తమిళ్, మలయాళీ బాషలలో ఏకంగా ఆరు సినిమాలని ఈ భామ లైన్ లో పెట్టింది.