దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో వరల్డ్ ఫేమస్ అయ్యాడు ప్రభాస్.ఈ సినిమా తర్వాత వరస పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.
ప్రస్తుతం రాధే శ్యామ్ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.రాధే శ్యామ్ సినిమాలో ప్రభాస్ కు జంటగా పూజ హెగ్డే నటిస్తున్నారు.
ఈ సినిమాను జులై 30 న విడుదల చేయబోతున్నారు.
ఈ సినిమా పూర్తి చేసుకుని మరొక రెండు సినిమాలను ప్రభాస్ లైన్లో పెట్టాడు.
సలార్, ఆది పురుష్ సినిమాలు ప్రకటించి ఇప్పటికే షూటింగ్ కూడా ప్రారంభించేసారు.ఒక వైపు సలార్ సినిమా షూటింగ్ చేస్తూనే మరో వైపు ఆది పురుష్ సినిమా షూటింగ్ కూడా చేస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నాడు ప్రభాస్.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా తెరకెక్కుతుంది.
అన్ని సినిమాల కన్నా లేటుగా ప్రకటించిన ఈ సినిమానే ప్రభాస్ ముందుగా స్టార్ట్ చేసాడు.
ప్రశాంత్ నీల్ ఈ సినిమాను ఉగ్రం సినిమాకు రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు.సలార్ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుంది.ఈ సినిమాతో పాటు ఆదిపురుష్ సినిమా షూటింగ్ కూడా చేస్తున్నాడు.రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తున్నాడు.
అంతేకాదు బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా నటిస్తున్నాడు.
ఓం రౌత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.టి సిరీస్ సంస్థ ఈ సినిమాను 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో సీత పాత్ర కోసం కృతి సనన్ ను ఎంపిక చేసారు.
కొన్ని రోజుల క్రితం కొంతమేరకు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేసింది.
తాజాగా ప్రభాస్ ఈ సినిమాలో జాయిన్ అవ్వడానికి ముంబై వెళ్లినట్లు తెలుస్తుంది.
ఇప్పుడు ప్రారంభమయ్యి వచ్చే నెల ఏప్రిల్ ఫస్ట్ వారం వరకు ఈ షూటింగ్ ఉంటుందని సమాచారం.అనుకున్న సమయానికి పూర్తి చేసి ఈ సినిమాను వచ్చే సంవత్సరం ఆగస్టు 11 న రిలీజ్ చెయ్యాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.