1.ఖమ్మం సభపై షర్మిల కో ఆర్డినేషన్ కమిటీ
ఏప్రిల్ 9వ తేదీన జరగనున్న ఖమ్మం సభకు కో ఆర్డినేషన్ కమిటీని షర్మిల నియమించారు.
2.తెలంగాణలో కరోనా
గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 313 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
3.హత్య కేసు నిందితుడు జిల్లా బహిష్కరణ
కృష్ణాజిల్లా మచిలీపట్నం మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మోకా భాస్కరరావు హత్య కేసులో ప్రధాన నిందితుడు చింత చిన్నిని ఆరు నెలల పాటు జిల్లా బహిష్కరణ చేస్తున్నట్లు కలెక్టర్ ఇంతియాజ్ ఆదేశాలు జారీ చేశారు.
4.న్యాయవాద దంపతుల హత్య కేసులో మరో వ్యక్తి అరెస్ట్
దేశ వప్తంగా సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాది దంపతులు గట్టు వామన్ రావు, నాగమణి హత్య కేసులో వెళ్ది వసంతరావు అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.హత్య కేసులో ఆరో నిందితుడిగా వెల్ది వసంతరావు ఉన్నారు.
5.రేపటి నుంచి ఎంసెట్ దరఖాస్తులు స్వీకరణ
ఎంసెట్ దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 20 నుంచి ప్రారంభంకానుంది విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు మే 18 వరకు సమర్పించవచ్చు ని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపి రెడ్డి తెలిపారు.
6.ఏపీకి తిరుపతి రాజధాని
ఏపీకి తిరుపతి రాజధాని అని, ఈ విషయం కాలజ్ఞానం లో ఉంది అంటూ మాజీ కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.
7.రైతుల సమ్మేళనం
గుంటూరు జిల్లాలోని పొన్నూరు మండలం బ్రాహ్మణకోడూరులో, రామినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు రైతు సమ్మేళనాలు నిర్వహించారు.
8.రేపు తిరుమలకు చంద్రబాబు
రేపు తిరుమలకు టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లనున్నారు 21వ తేదీన ఆయన మనవడు పుట్టినరోజు సందర్భంగా కాస్త ముందు గాని సతీసమేతంగా తిరుమలకు చేరుకోనున్నారు.
9.458 వ రోజుకి రాజధాని దీక్షలు
రాజధానిగా అమరావతి నే కొనసాగించాలి అంటూ డిమాండ్ చేస్తున్న రైతులు, మహిళలు చేపట్టిన నిరసనలు నేటికీ 458 వ రోజుకు చేరుకున్నాయి.
10.శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.21 కోట్లు
తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 5.21 కోట్లు లభించినట్లు టీడీపీకి ప్రకటించింది.
11.లోకేష్ పై ఫేక్ వీడియో
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పేరుతో యూట్యూబ్ లో ఫేక్ వీడియో అప్లోడ్ చేయడం పై మంగళగిరి పోలీస్ స్టేషన్ లో తెలుగు యువత , టిఎన్ఎస్ఎఫ్ నాయకులు గురువారం ఫిర్యాదు చేశారు.
12.కరోనా తీవ్రతరం .కేంద్రం మార్గదర్శకాలు
దేశవ్యాప్తంగా కరోనా కేసులు నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకూ కేంద్రం శుక్రవారం కరోనా మార్గదర్శకాలు జారీ చేసింది.
13.భారత్ లో కరోనా
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 39, 726 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
14.కృష్ణ జలాలపై కొనసాగిన విచారణ
ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల కేటాయింపులపై గురువారం ట్రిబ్యునల్ లో విచారణ కొనసాగింది.
15.21 నుంచి ఆమరణ దీక్ష : కేఏ పాల్
సాగు చట్టాలకు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటికరణకు నిరసనగా ఈ నెల 21 నుంచి ఢిల్లీ లో నిరవధిక ఆమరణ దీక్ష చేపట్టనున్నట్టు ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ప్రకటించారు.
16.గోదావరి మునిగి ముగ్గురు మృతి
భద్రాచలం ఇంటెక్ వెల్ ప్రాంతం వద్ద గోదావరిలో మునిగి ముగ్గురు మృతి చెందారు.
17.బోల్డన్ వర్సిటీ తో వి హబ్ ఒప్పందం
ఇంగ్లాండ్ లోని బోల్డన్ యునివర్సిటీ తో విహబ్ పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
18.ఒక్క క్లిక్ తో అంబులెన్స్
కాల్ హెల్త్ అనే సంస్థ ఒక్క క్లిక్ తో అంబులెన్స్ సౌకర్యం పొందే ఏర్పాటు చేసింది.కాల్ హెల్త్ అనే యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని అంబులెన్సు కావాలి అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేరుగా సదరు ప్రాంతానికి అంబులెన్సు చేరుకునేలా ఏర్పాటు చేసారు.
19 .కోవిడ్ వాక్సిన్ పై అపోహలు వద్దు
కోవిడ్ వాక్సిన్ పై ఎవరికీ ఎటువంటి అపోహలు వద్దు అని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు.
20 .ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 44, 070
24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 45 ,070 .