తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు.అల్లు అరవింద్ తెలివైన బిజినెస్ మ్యాన్ అని చాలా సార్లు రుజువు అయ్యింది.
బిజినెస్ పరంగా తన, మన అనే భేదం లేకుండా బిజినెస్ ను బిజినెస్ లాగానే చూడడంతో పాటు వ్యాపార రంగంలో ముందుకు కొనసాగుతున్నాడు.ఆయన వ్యాపార అంచనాలు, లెక్కలు ఎలా ఉంటాయో అని అర్థం అవ్వడానికి ఇటీవల ఆయన నెట్ ఫ్లిక్స్ తో చేసిన డీల్ అందుకు నిదర్శనం.
అల్లు అరవింద్ సొంత ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహా కు ఆరంభ దశలో పెద్దగా స్పందన రాకపోయినా కానీ, కాస్త మలయాళ డబ్బింగ్ సినిమాల పుణ్యమా కాస్త ముందుకు కొనసాగింది.ప్రస్తుతం నాంది, క్రాక్, జాంబి రెడ్డి, గాలి సంపత్ లాంటి కొత్త సినిమాలతో ఆహా ప్లాట్ ఫామ్ ఒక ఊపు ఊపుతుంది.
నేడు విడుదలకు సిద్ధమైన చావుకబురు చల్లగా సినిమా కూడా ఆహా ఓటిటి ప్లాట్ ఫామ్ లో ప్రేక్షకులను అక్కటుకోవడనికి సిద్ధం అయ్యింది.ఈ క్రమంలో అల్లు అరవింద్ నిర్మాతగా చేసే ప్రతి సినిమా కూడా ఇక ఆహా ఓటిటిలో చూడవచ్చు అని ప్రేక్షకులు అందరూ అనుకున్నారు.
కానీ.అల్లు అరవింద్ బిజినెస్ స్టైలే వేరు.
ఆయన తాజాగా నెట్ ఫ్లిక్స్ సంస్థతో డీల్ కుదిర్చాడు.తన బ్యానర్ లో సొంతంగా రూపొందుతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాకు డీల్ చేశారు.
ఈ సినిమాను తన సొంత ఓటిటి ఆహా లో కాకుండా నెట్ ఫ్లిక్స్ కు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు.మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాకు మంచి క్రేజ్ ఉండటంతో దానికి నెట్ ఫ్లిక్స్ నుంచి మంచి ఆఫర్ రావడంతో సినిమాపై పెట్టిన ఖర్చును రికవరీ అవుతుందన్న నమ్మకంతో డీల్ కు ఒకే అన్నాడు.
అంతేకాకుండా ప్రొడక్షన్ ను ఓటిటి ప్లాట్ఫామ్ ను కలపకుండా దేనికి దానికి విడివిడిగా ఇలా చేయడం ఆయన సక్సెస్ ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు.అంతేకాకుండా అలా వైకుంఠపురంలో సినిమా సైతం ఆహా ఓటిటి లో కాకుండా అమెజాన్ ప్రైమ్ కు ఇచ్చి ఒక్కసారిగా ప్రేక్షకులందరినీ షాక్ కు గురి చేశారు.
మరోవైపు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ప్రస్తుతం షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.అఖిల్ సినిమా కెరియర్ లో నాలుగో సినిమాగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తుండగా, అఖిల్ సరసన పూజా హెగ్డే కథానాయికగా వహిస్తుంది.
ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్ టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఈ సినిమా జూన్ 19 న ప్రేక్షకుల ముందుకు విడుదల కు సిద్ధంగా ఉంది.