ఈ మధ్య కాలంలో బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్యక్రమాల్లో రియాలిటీ షోలు ఎక్కువగా ప్రేక్షకాదరణ పొందుతున్నాయి.అలా ఎక్కువగా ప్రేక్షకాదరణను సొంతం చేసుకున్న షోలలో బిగ్ బాస్ షో కూడా ఒకటి.
బుల్లితెర హిందీ బిగ్ బాస్ షో 14 సీజన్లు పూర్తి చేసుకోగా తెలుగు బిగ్ బాస్ షో 4 సీజన్లు పూర్తి చేసుకుంది.త్వరలో తెలుగులో బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభం కానుందని నాగార్జున లేదా నాని బిగ్ బాస్ షోను హోస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
అయితే సీజన్ 5 ప్రారంభానికి చాలా రోజులు ఉన్నా ఈ సీజన్ లో పాల్గొనే కంటెస్టెంట్లు వీళ్లేనంటూ కొందరు సెలబ్రిటీల పేర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.బిగ్ బాస్ షో నుంచి ప్రతి సీజన్ లో పాపులర్ న్యూస్ ఛానెళ్లలో ఒకటైన టీవీ9 నుంచి ఒక యాంకర్ ఉంటారనే సంగతి తెలిసిందే.
ఈ సీజన్ లో బిగ్ బాస్ షోలో టీవీ9 యాంకర్ ప్రత్యూష పాల్గొనబోతున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఇప్పటివరకు టీవీ9 నుంచి బిగ్ బాస్ షోలో దీప్తి, జాఫర్, దేవీ నాగవల్లి పాల్గొన్నారు.మరో న్యూస్ యాంకర్ రోజాకు కూడా బిగ్ బాస్ షోకు ఆహ్వానం అందినట్టు తెలుస్తోంది.అయితే తుది జాబితాలో వీళ్లు ఉంటారో లేదో తెలియాలంటే మాత్రం కొన్నిరోజులు ఆగాల్సిందే.
ప్రేక్షకులు సైతం బిగ్ బాస్ షోపై తెగ ఆసక్తి చూపిస్తున్నారు.మరోవైపు ఈ షోకు పోటీగా జెమినీ ఛానల్ లో ఎవరు మీలో కోటీశ్వరులు పేరుతో రియాలిటీ షో ప్రసారం కానుంది.
ఈ షోకు స్టార్ హీరో ఎన్టీఆర్ యాంకర్ గా వ్యవహరిస్తూ ఉండటంతో ఈ షోపై మంచి అంచనాలు ఉన్నాయి.గతంలో నాగార్జున , చిరంజీవి ఈ షోకు హోస్ట్ లుగా వ్యవహరించగా జూనియర్ ఎన్టీఆర్ వాళ్లిద్దరినీ మించి మెప్పిస్తారేమో చూడాల్సి ఉంది.