టాలీవుడ్ యంగ్ హీరోల్లో నితిన్ ఒకరు.ఈయన భీష్మ సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న విషయం అందరికి తెలిసిందే.
ఈ సినిమా తర్వాత చెక్ మూవీతో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు.అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో హిట్ అవ్వలేదు.
చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ ప్రధాన పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కింది.
అయితే ఇప్పుడు నితిన్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాలో నితిన్ కు జోడీగా కీర్తి సురేష్ హీరోయినిగా నటిస్తుంది.ఈ సినిమా రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతుంది.
ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశి నిర్మిస్తున్నారు.దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది.కానీ కరోనా కారణంగా ఈ సినిమా వాయిదా పడుతూ ఉంది.సంక్రాంతికి విడుదల చేయాలనీ అనుకున్న అప్పుడు చాలా సినిమాలు రావడంతో సమ్మర్ లో రిలీజ్ చేయాలనీ అనుకున్నారు.ఈ సినిమా మార్చి 26 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇప్పటికే ఈ సినిమాకు సంభందించిన టీజర్, పోస్టర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
అయితే తాజాగా ఈ సినిమా గురించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్టీఆర్ రాబోతున్నట్టు వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి.ఇప్పటికే తారక్ కన్ఫర్మ్ అయినట్టు ఇండస్ట్రీ వర్గాల నుండి వినిపిస్తున్న టాక్.
ఇప్పటి వరకు చిత్ర యూనిట్ నుండి ఎలాంటి ప్రకటన రాలేదు.మరి చూడాలి ఈ వార్త నిజమో.
లేక కేవలం రూమర్ గానే మిగిలిపోతుందేమో.