జనసేన పార్టీ స్థాపించి ఏడు సంవత్సరాలు కావడంతో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు హైదరాబాదులో పార్టీ ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.ఈ క్రమంలో ఆయన బిజెపి పార్టీ పై చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి.
విషయంలోకి వెళితే తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆర్థికంగా దేశాన్ని దిశానిర్దేశం చేసిన పీవీ నరసింహారావు కూతురు టిఆర్ఎస్ అభ్యర్థికి మద్దతిస్తున్నట్లు తెలపడం జరిగింది.
ఇదే తరుణంలో తెలంగాణ బిజెపి .జనసేన ని పెద్దగా పట్టించుకోవటం లేదని, కలసి అడుగులు వేయటం లేదని కాంట్రవర్సీ కామెంట్ చేశారు.దీంతో పవన్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు.
పవన్ అటువంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందే అని అన్నారు.గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో, దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓడిపోయిన ప్రజావ్యతిరేకత కలిగిన టీఆర్ఎస్ పార్టీకి పవన్ మద్దతు ఇవ్వటం సరైంది కాదని పేర్కొన్నారు.
ఏదైనా భేషజాలు ఉంటే నేరుగా చెబితే బాగుండేది అని.ఈ విధంగా మీడియా ముందు మాట్లాడకుండా ఉండాల్సింది అన్నట్టు బండి సంజయ్ చెప్పుకొచ్చారు.ఈ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ న్యూట్రల్ గా ఉండాల్సింది అని తెలిపారు.
.