ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ గుర్తులపై జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో జగన్ పార్టీ తిరుగులేని విజయం సాధించిన సంగతి తెలిసిందే.11 కార్పొరేషన్లకు 11 అనగా మొత్తం వైసీపీ గెలవడం తోపాటు 75 మున్సిపాలిటీలకు 73 విజయాలు సాధించడంతో.రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ పార్టీ క్యాడర్ మరియు కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.ఇది జగన్ క్రెడిబులిటి కి పబ్లిక్ ఇచ్చిన గిఫ్ట్ అంటూ స్పందిస్తున్నారు.ఆ జిల్లా ఈ జిల్లా అనే తేడా లేకుండా చిత్తూరు నుంచి సిక్కోలు వరకు.వైసిపి గాలి గట్టిగా వీచింది.
దీంతో ప్రజలు ఇచ్చిన బ్లాక్ బస్టర్ విజయం పై ఏపీ సీఎం వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్ సోషల్ మీడియాలో స్పందించారు.ఈ గొప్ప విజయం ప్రజలది.
దేవుని దయతో ప్రతి అక్క చెల్లెమ్మ, ప్రతి సోదరుడు, స్నేహితుడు, ప్రతి అవ్వా, తాత మనస్ఫూర్తిగా ఆశీర్వదించడం వల్ల ఈ చారిత్రక విజయం సాధ్యమైంది.ఈ విజయం నా మీద మీరు పెట్టుకున్న నమ్మకాన్ని, బాధ్యతను మరింత పెంచింది.
ఇంకా మంచి చేయడానికి మీ కుటుంబంలో ఒకరిగా మరింత తాపత్రయ పడతాను.ఈ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రతి సోదరుడికి, అక్క చెల్లెమ్మకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను అంటూ జగన్ పేర్కొంటూ పోస్టు పెట్టారు.