రేపు మాచర్ల నియోజకవర్గానికి సీఎం జగన్..!!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు.విషయంలోకి వెళితే మాచర్లలో జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులను జగన్ సన్మానించనున్నారు.

 Cm Jagan For Macherla Constituency Tomorrow Pingali Venkayya, Ys Jagan, Guntur,-TeluguStop.com

త్వరలో 75 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్న క్రమంలో ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా  జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుటుంబాన్ని సత్కరించాలని డిసైడ్ అయ్యారు.

దీనిలో భాగంగా పింగళి వెంకయ్య కుమార్తె సీతా మహాలక్ష్మి మరియు కుటుంబ సభ్యులను జగన్ కలవబోతున్నారు.

దీంతో రేపు ఉదయం 11 గంటల 45 నిమిషాలకు జగన్ మాచర్ల నియోజకవర్గానికి చేరుకున్నారు.ప్రస్తుతం పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులు మాచర్ల లోని పిడబ్ల్యుడి కాలనీలో నివాసం ఉంటున్నారు.

ఈ క్రమంలో కుమారుడి దగ్గరే పింగళి వెంకయ్య కుమార్తె సీతా మహాలక్ష్మి ఉంది.  ముఖ్యమంత్రి పర్యటన కావటంతో గుంటూరు జిల్లా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అప్రమత్తమైంది.

జగన్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube