ఎన్నికల్లో గెలవాలనే తపన ఉండాలి గానీ, తప్పుడు మార్గంలో వెళ్లి అందుకునే గెలుపు, గెలుపు కాదంటారు మహానుభావులు.కానీ నేడు చెదలుపట్టిన రాజకీయాల్లో ఉన్న దాదాపు నేతలంతా గోడమీది పిల్లులే.
పదవులు పొందడం కోసం ఎంతటి నీచానికైన దిగజారుతారు.ఎన్ని కోట్లు అయినా ఖర్చు చేస్తారు.
గెలిచాక ముక్కుపిండి పెట్టిన ఖర్చునంతా రాబట్టుకుంటారు.
ఇకపోతే ఏపీలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.
ఈ నేపధ్యంలో నంద్యాల లోని 12వ వార్డు నుంచి బరిలోకి దిగిన ఖండే శ్యామ్ సుందర్ లాల్ అనే స్వతంత్ర అభ్యర్థి ఓటర్లకు గాలం వేస్తూ అడ్దంగా బుక్కైయ్యాడు.
ఓటర్లను ఆకర్షించి ఓట్లు పొందడానికి బిర్యానీ ప్యాకెట్లలో ముక్కు పుడకలు పంచబోయాడు.
కానీ ఈ సమాచారాన్ని పక్కాగా పోలీసుల చెవిన చేరింది.దీంతో సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి బిర్యానీ పొట్లాలను స్వాధీనం చేసుకున్నారు.
వీటిని పంచుతున్న ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకుని వారి నుంచి 4 బైక్ లు, రూ.55 వేల నగదు, 23 బంగారు ముక్కు పుడకలు స్వాధీనం చేసుకున్నారు.ఇక ఈ రాద్దాంతానికి మూలమైన వారందిరి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారట పోలీసులు.