రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కలయికలో పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా లైగర్.బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.చార్మి, కరణ్ జోహార్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.ఇక ఈ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ గ్రాండ్ గా ఉండే విధంగా విజయ్ ప్లాన్ చేసుకుంటున్నాడు.అక్కడ కూడా తన హవాని కొనసాగించడానికి లైగర్ మూవీని బేస్మెంట్ విజయ్ భావిస్తున్నాడు.దీంతో ఈ సినిమా కోసం పూరీ స్టైల్ లోకి దేవరకొండ మారిపోయాడు.
ఇదిలా ఉంటే బాక్సింగ్ నేపధ్యంలో తండ్రి, కొడుకుల సెంటిమెంట్ తో మాఫియా ఎలిమెంట్స్ తో ఈ సినిమా కథాంశం ఉండబోతుందని ఇప్పటికే టాక్ వినిపించింది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబై పరిసరాల్లో జరుగుతుంది.
ఇందులో సురేష్ గోపి, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కీలక పాత్రలలో కనిపించబోతున్నారు.
ఏప్రిల్ వరకు ముంబైలోనే షూటింగ్ ఉంటుందని తెలుస్తుంది.
తరువాత మే నుంచి హైదరాబాద్ లో లాస్ట్ షెడ్యూల్ ని దర్శకుడు పూరీ ప్లాన్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తుంది.ఇక ఈ షెడ్యూల్స్ లోనే సాంగ్స్ కూడా షూట్ చేసేస్తున్నారని తెలుస్తుంది.
అలాగే జూన్ నాటికి లైగర్ షూటింగ్ కి ప్యాకప్ చెప్పేయాలని పూరీ టీమ్ ప్లాన్ చేసుకుంటుంది.ఏది ఏమైనా పూరీ జగన్నాథ్ కెరియర్ లో ఎక్కువ రోజులు షూటింగ్ జరుపుకున్న సినిమాగా మాత్రం లైగర్ నిలిచిపోతుంది.
మరి ఈ సినిమాతో దేవరకొండ విజయ్ ఎంత వరకు బాలీవుడ్ ని ఎట్రాక్ట్ చేస్తాడని వేచి చూడాలి.