సందీప్ కిషన్ హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా హాకీ నేపథ్యంలో రూపొందిన ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి.
ప్రేక్షకుల నుండి పర్వాలేదు అనే టాక్ వచ్చింది.మొదటి మూడు రోజులు మంచి వసూళ్లను నమోదు చేసిన ఈ సినిమా లాంగ్ రన్ లో మంచి వసూళ్లు సాధించి బ్రేక్ ఈవెన్ చేరుకుంటుందని అంతా భావించారు.
కాని అనూహ్యంగా ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా నిరాశ పర్చింది.వసూళ్ల విషయంలో నిర్మాతలకు రక్త కన్నీరు మిగిల్చింది.
టాక్ పరంగా హిట్ అయిన ఈ సినిమా వసూళ్ల పరంగా మాత్రం నిరాశ పర్చింది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమా ను సందీప్ కిషన్ సన్నిహితులతో కలిసి సొంతంగా నిర్మించాడు.
ఆర్థికంగా కాస్త ఎక్కువే పెట్టి ఈ సినిమాను తీసిన ఆయనకు నిరాశ తప్పలేదు.పెద్ద ఎత్తున వసూళ్లు సాధిస్తుందని ఆశించిన ఆయనకు వీక్ డేస్ జలక్ ఇచ్చేలా కలెక్షన్స్ నమోదు అయ్యాయి.
ఇప్పటి వరకు సినిమా బ్రేక్ ఈవెన్ సాధించలేదు.వీక్ డేస్ లో వసూళ్లు తగ్గుముఖం పట్టడంతో ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా అనే అనుమానం వ్యక్తం అవుతోంది.
సందీప్ కిషన్ చాలా కష్టపడి ఈ సినిమాను చేశాడు.హీరోగా నిర్మాతగా ఈ సినిమా పై సందీప్ పెట్టుకున్న ఆశలు అన్ని కూడా అడియాశాలు అయినట్లేనా అంటూ ఆయన సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వీక్ డేస్ ల్లో ఏ హీరో సినిమా కు కూడా పెద్దగా వసూళ్లు నమోదు అవ్వడం లేదు.పెద్ద సినిమా లు పోటీ లేకున్నా కూడా సందీప్ కిషన్ సినిమా వసూళ్ల విషయంలో నిరాశ పర్చింది.