ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా సినీ నటి నటులు, ఇతర రంగాలకు చెందిన వ్యక్తులు, సామాన్యులు ప్రతి ఒక్కరూ మహిళను గౌరవిస్తూ వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా తమ ఇంట్లో ఉన్న మహిళలతో ఫోటోలు దిగుతూ.
మహిళల గురించి గొప్ప విషయాలు తెలుపుతూ షేర్ చేస్తున్నారు.ఇప్పటికే పలువురు నటులు సోషల్ మీడియా వేదికగా మహిళా దినోత్సవం సందర్భంగా కొన్ని ఫోటోలతో కొన్ని విషయాలను కూడా పంచుకున్నారు.
తాజాగా సాయి ధరమ్ తేజ్ కూడా సోషల్ మీడియా వేదికగా మహిళా దినోత్సవానికి శుభాకాంక్షలు తెలిపాడు.
మెగా స్టార్ చిరంజీవి మేనల్లుడు యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ గురించి అందరికీ తెలిసిందే.
ఇక ఈయన సినిమాలు కూడా ఎంతో వినోదాన్నీ ఇస్తాయి.తన నటనతో గుర్తింపు సొంతం చేసుకొని వరుస విజయాలను అందుకున్నాడు.
ఇక తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ ఫోటోని షేర్ చేయగా ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఆ ఫోటోలో సాయి ధరమ్ తేజ్ వాళ్ళ అమ్మ తో ఉండటమే కాకుండా మహిళా దినోత్సవం సందర్భంగా అమ్మా లవ్ యూ, హ్యాపీ ఉమెన్స్ డే అని కామెంట్ పెట్టాడు.
ఈ ఫోటో నెటిజన్లను బాగా ఆకట్టుకుంది.అంతేకాకుండా.
చిరంజీవి సోదరి, తన తల్లి అయినా లక్ష్మీ దుర్గ తన ఇద్దరి కొడుకుల ప్రగతిని చూసి మురిసిపోతున్నారు.ఇటీవలే ఉప్పెన సినిమాతో పరిచయమైన యంగ్ హీరో వైష్ణవ తేజ్ తన రెండవ కొడుకు.
ఈ సినిమాతో మంచి విజయం అందుకున్న వైష్ణవి తేజ్ హీరో గా నిలిచాడు.అంతేకాకుండా సాయి ధరమ్ తేజ్ కూడా టాలీవుడ్ లో మంచి గుర్తింపును సాధించుకోగా.
ఇద్దరు కొడుకుల ఎదుగుదలను చూసి ఆ తల్లి మురిసిపోతుంది.