పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు కంప్లీట్ అవుతుందో క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం..!!

విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలవరం కంప్లీట్ అయితే చాలా వరకు ఆర్థికంగా రాష్ట్రం గడిలో పడుతుంది అని చాలామంది ఆర్థిక నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.ఇదిలా ఉంటే పోలవరం ప్రాజెక్టు పనుల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు త్వరితగతిన కీలకంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే.

 The-central-government Has Given Clarity On When The Polavaram Project Will Be C-TeluguStop.com

ఇలాంటి తరుణంలో టిడిపి పార్టీ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్అసలు పోలవరం ప్రాజెక్టు పనులు ఎప్పుడు పూర్తవుతాయి అన్న దానిపై కేంద్ర ప్రభుత్వాన్ని రాజ్యసభలో ప్రశ్నించారు.

ఈ సందర్భంగా కేంద్ర జల శక్తి సహాయమంత్రి కటారియా రవీంద్ర కుమార్ వేసిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.

వచ్చే ఏడాది ఏప్రిల్ మాసం కల్లా పోలవరం మొత్తం కంప్లీట్ అవుతుందని స్పష్టం చేశారు.మే నాటికి స్పిల్ వే పనులు, క్రస్టు గేట్ల పనులు ఏప్రిల్ నాటికి, కాఫర్ డ్యామ్ నిర్మాణం జూన్ కల్లా పూర్తవుతాయని పేర్కొన్నారు.

వచ్చే ఏడాది నాటికి పోలవరం కుడి ఎడమ కాల్వల నిర్మాణం మొత్తం పూర్తవుతాయని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube