తెలంగాణ నిర్మల్ జిల్లాలోని భైంసా పట్టణంలో నిన్న రాత్రి ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగగా, ఈ దాడిలో ప్రజలతో పాటుగా పోలిసు, మీడియా వ్యక్తులకు కూడా గాయాలు అయ్యాయన్న విషయం తెలిసిందే.ఈ అంశం పై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు.
ఈమేరకు భైంసాలో జరిగిన అల్లర్లకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించాలని, అల్లర్లకు కారణం అయిన వారి పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ క్రమంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ భైంసా అల్లర్ల పై గరం అయ్యారు.
చట్టవ్యతిరేక చర్యలను ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లో సహించదని అల్లరి మూకలకు హెచ్చరించారు.ఇక భైంసా ప్రజలను ఉద్దేశిస్తూ పుకార్లను నమ్మొద్దని, ద్వేషపూరిత ప్రసంగాలు చేసే వారి ఉచ్చులో పడొద్దని కేటీఆర్ వెల్లదించారు.
ఇకపోతే భైంసాలో హింసకు పాల్పడిన అల్లరి మూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి మహమూద్ అలి, డీజీపీ మహేందర్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు
.