తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టడానికి ఆలోచన చేస్తున్నావు వైయస్ షర్మిల ఉమెన్స్ డే నాడు కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా లోటస్ పాండ్ లో నిర్వహించిన కార్యక్రమంలో షర్మిల మాట్లాడుతూతెలంగాణ గడ్డరాజకీయ చైతన్యానికి అడ్డా అని తెలిపారు.
తెలంగాణ లో మహిళలు ఎవరు తక్కువ కాదని ఈ గడ్డపై పుట్టిన రాణి రుద్రమదేవి రుజువు చేసింది అని చరిత్ర సృష్టించింది అని తెలిపారు.అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో మహిళల పాత్ర ఎంతో ఉంది అని, కానీ తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం మహిళలకు అంతగా ప్రాధాన్యత లేదని దీనికి కారణం టిఆర్ఎస్ ప్రభుత్వం అన్నట్టు మండిపడ్డారు.
ఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎంతో మంది మహిళలకి మంత్రి పదవులు వచ్చాయని కానీ కెసిఆర్ ప్రభుత్వంలో కేవలం ఇద్దరు మహిళలకు మాత్రమే, అది కూడా ఐదు సంవత్సరాల తర్వాత వచ్చినట్లు షర్మిల పేర్కొన్నారు.తాను మాత్రం మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తాను, మహిళా హక్కుల కోసం పోరాడుతా అంటూ షర్మిల ఈ కార్యక్రమంలో వచ్చిన మహిళలకు హామీ ఇచ్చారు.