కన్నడ సినిమాతో హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసిన గ్లోబల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న నటి దీపికా పదుకునే.బాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్స్ లలో ప్రస్తుతం దీపికా కూడా టాప్ చైర్ లో ఉంది.
ఈ అమ్మడు ప్రస్తుతం తన భర్త రణవీర్ సింగ్ తో కలిసి నటించిన 83 మూవీ రిలీజ్ కి రెడీ అవుతుంది.మరో వైపు బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తో ఓ సినిమా చేయబోతుంది.
వీటితో పాటు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కబోయే పాన్ ఇండియా సైన్స్ ఫిక్షన్ మూవీలో హీరోయిన్ గా కన్ఫర్మ్ అయ్యింది.ఈ సినిమా కోసం ఏకంగా 12 కోట్ల వరకు ఈ అమ్మడు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉంటే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఈ అమ్మడు మరో వైపు సోషల్ యాక్టివిటీస్ లో కూడా భాగస్వామ్యం అవుతూ సొసైటీకి సర్వీస్ చేస్తుంది.
ఈ నేపధ్యంలో దీపికా పదుకునే అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది.
వెరైటీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ ఇంపాక్ట్ రిపోర్ట్-2021 లో ఆమె చోటు దక్కించుకుంది.సినిమాకు ఆమె చేసిన కృషి, సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నందుకుగానూ ఈ ప్రత్యేక గుర్తింపు లభించింది.
దీనిపై స్పందించిన దీపికా చాలా గర్వంగా ఉందని తెలిపింది.ఆమె లైవ్ లాఫ్ లవ్ ఫౌండేషన్ ద్వారా మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించడంతో పాటు, మహిళల్లో ఆత్మస్థైర్యం నింపే కథలతో సినిమాలు చేస్తుంది.
కేవలం కమర్షియల్ జోనర్ లోనే కాకుండా విమెన్ సెంట్రిక్ కథలకి కూడా ప్రాధాన్యత ఇస్తూ సినిమాలు చేస్తుంది.