పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలతో పాటు ఇటు సినిమాలు కూడా చేస్తూ రెండింటినీ బాలన్స్ చేస్తున్నాడు.ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.
ఒకే సారి రెండు మూడు సినిమాలు చేస్తూ ఎప్పుడు లేనంత ఫాస్ట్ గా సినిమాలు పూర్తి చేస్తున్నాడు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రాన్ని పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేసాడు. వకీల్ సాబ్ హిందీ పింక్ మూవీ కి రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను దిల్ రాజు, బోణీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ సినిమాను వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నాడు.అంజలి, నివేతా థామస్ ఈ సినిమాలో కీలక రోల్స్ చేస్తున్నారు.
అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లాయర్ గా నటిస్తున్నాడు.వకీల్ సాబ్ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.ఇప్పటికే రిలీజైన టీజర్ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేసింది.ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.కొద్దిరోజుల క్రితమే సత్యమేవ జయతే అనే సాంగ్ ను విడుదల చేసారు.
అంతకముందు వచ్చిన మగువ మగువ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
ఇప్పుడు మూడవ సాంగ్ ను రెడీ చేస్తున్నట్టు రామజోగయ్య శాస్త్రి ట్విట్టర్ ద్వారా తెలిపారు.
ట్విట్టర్ లో అయన ట్వీట్ చేస్తూ.నిన్న రాత్రి విన్నాం.
ముచ్చటగా ముద్దుగా.హ్యాట్రిక్ లెక్కల్లో ఉంది.
రాస్కోరా సాంబా అంటూ పవన్ కళ్యాణ్ డైలాగ్స్ చెబుతూ తెలిపాడు.అంతేకాదు థమన్ కు థాంక్స్ చెబుతూ మరొక వారంలో అద్భుతమైన సాంగ్ రాబోతుందని తెలిపారు.