సాధారణంగా కొందరి ముఖం తరచూ ఆయిలీగా మారుతుంటుంది.ఎన్ని సార్లు ముఖాన్ని వాటర్తో క్లీన్ చేసుకున్నా.
మళ్లీ క్షణాల్లోనే జిడ్డు జిడ్డుగా అయిపోతుంది.ఇలాంటి వారు మేకప్ వేసుకునేందుకు కూడా భయపడుతుంటారు.
ఎందుకంటే, మేకప్ వేసుకున్నా.ఆయిలీగా అయిపోయి చిరాగ్గా మారిపోతుంది.
అయితే అధిక జిడ్డును అదుపులో ఉంచుకుని అందంగా, ఫ్రెష్గా కనిపించాలనుకుంటే.ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాలను ఖచ్చితంగా పటించండి.
ముందుగా ఒక బౌల్లో పెసర పిండి, పాలు మరియు రోజ్ వాటర్ వేసి బాగా కలుపుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖాన్ని పూతలా వేసుకుని.ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి.ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల చర్మంపై అదనపు నూనెను తొలగిపోయి.ముఖం ఫ్రెష్గా, కాంతి వంతంగా మారుతుంది.
అలాగే ఒక బౌల్లో బేకింగ్ సోడా, నిమ్మ రసం వేసి మిక్స్ చేసుకుని.ముఖానికి అప్లై చేయాలి.పావు గంట లేదా అర గంట పాటు ఆరనివ్వాలి.ఆ తర్వాత కొద్దిగా నీళ్లు జల్లి.
రుద్దుతూ ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి.ఇలా తరచూ చేయడం వల్ల.
చర్మంపై జిడ్డును తొలిగిస్తుంది.అదే సమయంలో డెడ్ స్కిన్ సెల్స్ను కూడా నివారిస్తుందా.
దాంతో ముఖం తాజాగా, ప్రకాశవంతంగా మారుతుంది.
ఇక ఒక బౌల్లో బియ్యంపిండి, టమాటా గుజ్జు మరియు తేనె వేసి బాగా కలుపుకోవాలి.
ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్లా వేసుకుని.అర గంట పాటు వదిలేయాలి.
అనంతరం చల్లటి నీటితో ముఖాన్ని క్లీన్గా వాష్ చేసుకోవాలి.ఇలా రెగ్యులర్గా కాకుండా రెండు రోజులకు ఒక సారి చేయడం వల్ల.
చర్మంపై నూనెను నియంత్రిస్తాయి.దాంతో ఫేస్ ఫ్రెష్గా, గ్లోగా మరియు అందంగా మారుతుంది
.