ప్రస్తుతం మనుషులు ఎక్కువగా గడుపుతున్నది సోషల్ మీడియాలో అనే విషయం మనకు తెలిసిందే.సాంకేతిక విప్లవం వచ్చిన తరువాత మానవ సంబంధాలు క్షీణించి సామాజిక మాధ్యామాలలోనే ఎక్కువగా గడుపుతున్న పరిస్థితి ఉంది.
యుక్త వయసు నుండి మొదలుకొని 62 ఏళ్ల బామ్మ వరకు అందరూ సోషల్ మీడియాలో గడుపుతూ తాము చేసే ప్రతి పనిని అప్ డేట్ చేయడంతో పాటు, తమ దైనందిన జీవితంలో జరిగే ముఖ్యమైన విషయాల్ని సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేస్తుంటారు.అయితే ఇప్పుడు మహిళల సోషల్ మీడియా చాటింగ్ లకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది.
ఐతే రోజూ మహిళలు ట్విట్టర్ లో ఏం మాట్లాడుకుంటున్నారనే దానిపై ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.మొత్తం 5, 22, 992 ట్వీట్లతో పాటు 700 మహిళలను ఆధారంగా చేసుకొని ఈ సర్వే జరిగింది.ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న విషయాలపై 2.08 శాతం మాట్లాడుకుంటున్నారని, సెలెబ్రెటీలకు సంబంధించిన విషయాలపై 14.5 శాతం, సామాజికంగా జరుగుతున్న మార్పులపై 8.7 శాతం మహిళలు చర్చించుకుంటున్నారని తెలిసింది.ఏది ఏమైనా మహిళల ఆలోచనా విధానమా ఎంతగానో మారిందని మనం చెప్పుకోవచ్చు.మహిళలు కూడా మగవారితో సమానంగా ఉద్యోగాలు చేస్తున్నా, అన్ని విషయాలపై సరైన అవగాహన కలిగి ఉంటున్నారని,ప్రతి ఒక్క విషయంపై అవగాహన పెంచుకుంటున్నారని మరొక్క సారి ఋజువైందని చెప్పవచ్చు.